రాజధాని విషయమై గత కొన్ని రోజులుగా జరుగుతున్న చర్చ తీవ్ర స్థాయికి చేరింది.ఈ విషయమై ఒక క్లారిటీ ఇచ్చేందుకు అసెంబ్లీ సమావేశాలను ప్రత్యేకంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్దం అయ్యింది.
నేటి నుండి ఏపీ ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి.ఈ సమావేశాల్లో రాజధాని వికేంద్రీకరణ గురించి ప్రధానంగా చర్చించబోతున్నారు.
రాజధాని వికేంద్రీకరణ బిల్లును తీసుకు వచ్చేందుకు సిద్దం అవుతున్న నేపథ్యంలో తెలుగు దేశం సభ్యులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
నేడు ఉదయం అసెంబ్లీలోకి స్పీకర్ వచ్చి రాగానే తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యేలు అంతా కూడా బ్యాడ్ మార్నింగ్ అంటూ గట్టిగా అరిచారు.
మామూలుగా అయితే స్పీకర్ లోనికి రాగానే గుడ్ మార్నింగ్ స్పీకర్ గారు అంటూ లేచి ఆహ్వానిస్తారు.కాని నేడు తమ్మినేని రాగానే తెలుగు తమ్ముళ్లు బ్యాడ్ మార్నింగ్ అంటూ చెప్పడం అసెంబ్లీలో చర్చనీయాంశం అయ్యింది.
వారి బ్యాడ్ మార్నింగ్కు తమ్మినేని స్పందిస్తూ గుడ్ మార్నింగ్ చెప్పి అంతా బాగుండాలని కోరుకునే వాళ్లను చూశాం.కాని ఇలా బ్యాడ్ మార్నింగ్ చెప్పే వారి గురించి ఏం మాట్లాడుతాం అంటూ సభను ప్రారంభిస్తున్నట్లుగా ప్రకటించాడు.