తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఎప్పుడు సీఎం జగన్ ని విమర్శిస్తూ ఉంటారు అన్న సంగతి తెలిసిందే.చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అసెంబ్లీ సాక్షిగా జగన్ పై గోరంట్ల బుచ్చయ్య చౌదరి చేసిన వ్యాఖ్యలు ఇప్పటికి కూడా పొలిటికల్ గా హీట్ పుట్టిస్తాయి.
అటువంటి బుచ్చయ్యచౌదరి తాజాగా సీఎం జగన్ ని మెచ్చుకున్నరు.మేటర్ లోకి వెళ్తే 2019 నుండి జగన్ అధికారంలోకి వచ్చి వంద పనులు చేస్తే… అందులో 99 తప్పు లేనని చెప్పుకొచ్చారు.
ఈ క్రమంలో తప్పుల నుండి ప్రజల దృష్టిని మళ్లించడానికి వైసీపీ ప్రభుత్వం అనేక రీతులుగా వ్యవహరిస్తుందని తెలిపారు.ఇప్పటి వరకూ అప్పుల గురించి రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి సమాధానం ఇవ్వలేదని.
అదే విధంగా ప్రత్యేక హోదా గురించి కూడా మాట్లాడటం లేదని పెరిగిన ధరల గురించి కూడా నోరు మెదపడం లేదని మండి పడ్డారు.ఇక ఉద్యోగస్తుల సమస్యలపై కూడా ప్రభుత్వం సరిగ్గా వ్యవహరించడం లేదని ఇటువంటి సమస్యల నుండి ప్రజల దృష్టిని మళ్ళించడానికి.
కొత్త జిల్లాల టాపిక్ తెరపైకి తెచ్చారని తెలిపారు.ఈ క్రమంలో 99 తప్పులు చేసిన జగన్ కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టి ఒక మంచి పని చేశారు అని కొనియాడారు.
ఎన్టీఆర్ జిల్లాగా జగన్ పెట్టడంతో అటు చంద్రబాబు అదే విధంగా బాలకృష్ణ మరియు పురందేశ్వరి కూడా స్వాగతించడం జరిగింది.