ఏపీలో పాలిటిక్స్ చిత్రంగా టర్న్ అవుతున్నాయి.నిన్న మొన్నటి వరకు వైకాపా నుంచి పెద్ద ఎత్తున టీడీపీ బాట పట్టిన నేతలను మనం చూశాం.
బాబు ఆకర్ష్ దెబ్బకి వైకాపా రెక్కలు విరిగిన ఫ్యాన్ మాదిరిగా మారిపోయింది.అసలు ఎప్పుడు ఎవరు టీడీపీ పంచన చేరతారో కూడా తెలియని విధంగా పరిస్థితి ఒక్కసారిగా జగన్కి ఝలక్ ఇచ్చిన పరిస్థితి తయారైంది.
అయితే, రోజులన్నీ ఒకే విధంగా ఉండవన్నట్టు.టీడీపీలో బాబు దెబ్బకి వేగలేక పోతున్నవాళ్లు.
ఇప్పుడు వైకాపా జగన్ పంచన చేరేందుకు రెడీ అవుతున్నారనే సమాచారం వినవస్తోంది.
ముఖ్యంగా చంద్రబాబు ఇటీవల ప్రకటించినట్టు కేబినెట్ విస్తరణ చేపడితే.
కొందరు మంత్రులకు ఘోరమైన అవమానం తప్పదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.ఈ నేపథ్యంలో ముందే తన భవిష్యత్తును అంచనా వేసిన మంత్రి రావెల కిశోర్బాబు .ముందే అన్నీ చక్కబెట్టుకుంటున్నారట.ఈ క్రమంలో ఇటీవల జరిగిన ఓ పరిణామం దీనికి బలాన్ని చేకూరుస్తోంది.
ఇటీవల మంత్రి తన ఇంటి దగ్గర అకస్మాత్తుగా అదృశ్యమయ్యారు.అప్పట్లో ఆయన తన ఫ్రెండ్ ఇంటికి డిన్నర్కి వెళ్లానని చెప్పారు.
అయితే, దీనిపై అనుమానం వచ్చిన సీఎం చంద్రాబు విజిలెన్స్ ఎంక్వయిరీ చేయించారు.
రంగంలోకి దిగిన అధికారులు ఆ అదృశ్య సమయంలో మంత్రి రావెల వైకాపా ఎంపీతో రహస్య మంతనాలు సాగించినట్టు నివేదిక సమర్పించింది.
ఈ పరిణామం అటు చంద్రబాబును, ఇటు టీడీపీ నేతలను ఖంగు తినిపించింది.మంత్రి రావెల వైకాపా ఎంపీ, జగన్ బంధువు వై.వి.సుబ్బారెడ్డితో రహస్యంగా భేటీ జరిపారట.తనను మంత్రి పదవి నుంచి తొలగిస్తే…తాను టీడీపీలో ఉండనని, వైకాపా తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమేనని, దీనికి గాను లైన్ క్లియర్ చేయాలని సుబ్బారెడ్డిని రావెల కోరారడట.
అయితే ఆ భేటీలో ఇంకా ఏం జరిగిందో బయటకు తెలియడం లేదు.
ప్రస్తుతానికి మాత్రం రావెల.సుబ్బారెడ్డితో భేటీ అయ్యారనేది నిజమని తెలుస్తోంది.
దీనిని బట్టి మంత్రి విస్తరణ అనంతరం రావెల జగన్ పక్షాన చేరడం ఖాయంగా కనిపిస్తోంది.పాలిటిక్స్ కాబట్టి ఏమైనా జరగొచ్చు!! అనుకుందామా?!
.