టీడీపీ మేనిఫెస్టోపై మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి స్పందించారు.చంద్రబాబు మేనిఫెస్టోలోని పొందుపరిచిన హామీలన్నీ కాపీ కొట్టినవేనని విమర్శించారు.
కర్ణాటకలో కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిన హామీలను టీడీపీ కాపీ కొట్టిందని మంత్రి కాకాణి ఆరోపించారు.ఇచ్చిన హామీలను నెరవేర్చిన చరిత్ర చంద్రబాబుకు లేదని చెప్పారు.
గతంలోనూ రుణమాఫీ అమలు చేయకుండా రైతులను ఇబ్బందులు పెట్టారని మండిపడ్డారు.