ప్రస్తుతం ఏపీ అధికార పార్టీ టీడీపీలో నాయకుల వలసలు జోరందుకున్నాయి.ఇప్పటికే చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, మేడ మల్లికార్జున్రెడ్డి, ఎంపీ అవంతి శ్రీనివాస్… ఇలా ఒక్కొక్కరుగా టిడిపికి రాజీనామా చేసి ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోతున్నారు.
ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు టిడిపిలో ఆందోళన పెంచుతోంది.ఒక పక్క ఏపీలో పార్టీకి మైలేజ్ పెరిగింది అనుకుంటున్న సమయంలో… నాయకుల వలసలు ఆందోళన కలిగిస్తున్నాయి.
తాజాగా టిడిపి వ్యవస్థాపక సభ్యుడు విజయ్ ఎలక్ట్రికల్స్ అధినేత దాసరి జై రమేష్ టిడిపిని వీడి వైసీపీలో చేరేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు.ఈ మేరకు ఫిబ్రవరి 15 శుక్రవారం సాయంత్రం నాలుగు గంటలకు జగన్ తో దాసరి జై రమేష్ భేటీ కాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.ఆయనకు వైసీపీ తరపున విజయవాడ ఎంపీ సీటు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది.
.
తాజా వార్తలు