టిడిపి కార్యాలయం పైన మరియు టిడిపి నేత పట్టాభి ఇంటిపైన వైసీపీ చేసిన దాడులకు నిరసనగా చంద్రబాబు నాయుడు నేడు రాష్ట్రవ్యాప్త బంద్ కి పిలుపునిచ్చిన నేపథ్యంలో అనంతపురం జిల్లాలో టీడీపీ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ సీజేశారు.హిందూపురంలో బాలకృష్ణ ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు.
కార్యకర్తలు ఎవరు రోడ్డుపై కి రాకుండా పోలీసులు అడ్డుకుని స్టేషన్ కు తరలించారు.తెదేపా నాయకులు బంద్ కార్యక్రమంలో పాల్గొనకుండా ముఖ్యమైన తెదేపా నాయకులను ఇంటి వద్దనే పోలీసులు హౌస్ అరెస్టులు చేస్తున్నారు.
అనంతపురం మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి ని హౌస్ అరెస్ట్ చేశారు.
ప్రధాన రహదారుల వద్ద పోలీసులు భారీగా మోహరించారు.
దీంతో బంద్ ప్రభావం పట్టణంలో కొనసాగడం లేదు.