తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలం పెద్ద శంకర్లపూడి లో ప్రత్తిపాడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు.అనంతరం మీడియాతో మాట్లాడుతూ… ఎప్పుడు ఎన్నికలు వచ్చినా టీడీపీ అధికారంలోకి రావడం ఖాయం.
జిల్లా లో ప్రత్తిపాడు నియోజకవర్గం టీడీపీ కీ బలమైన నియోజకవర్గం.
ఈ నియోకవర్గానికి వరుపుల రాజా బలమైన నాయకుడు ఉత్సాహ వంతడు.
రాజా పనితీరు గత మున్సిపల్ ఎన్నికలలో చూసాము.
నవ రత్నాలు పేరుతో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రజలను మోసం చేశాడు.
టీడీపీ చేసిన అభివృద్ధి తప్ప వైఎస్సార్సీపీ చేసిన మరో అభివృద్ది కార్యక్రమం ఏదీ కనిపించడం లేదు.
రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పుల భారం ప్రజల పైనే పడుతుంది.
హద్దులు దాటి అప్పులు చేస్తున్న ముఖ్యమంత్రి అప్పులు తీర్చే పరిస్థితులు కన్పించడం లేదు.రాష్ట్రం అంధకారం లోకి ముంచిన రాష్ట్ర ముఖ్యమంత్రి.