ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన ముగిసిన అధ్యాయమని టీడీపీ నేత సోమిరెడ్డి అన్నారు.దాని గురించి ఇప్పుడు మాట్లాడటంలో అర్థం లేదని చెప్పారు.
సెంటిమెంట్ ను రెచ్చగొట్టి టీఆర్ఎస్ కు లాభం చేసేందుకు వైసీపీ కుట్ర చేస్తుందని ఆరోపించారు.విభజన చట్టం ప్రకారం రావాల్సిన రూ.లక్ష కోట్లను ఇవ్వాలని కేసీఆర్ ను అడిగే ధైర్యం లేదని ఎద్దేవా చేశారు.తెలంగాణలో కలపమనడానికి ఆంధ్ర రాష్ట్రం మీ అబ్బ సొత్తనుకున్నారా అని ప్రశ్నించారు.
రాష్ట్రాన్ని పాలించడం చేతకాకపోతే గద్దె దిగి పారిపోండని విమర్శించారు.