కేసీఆర్ పై నిప్పులు చేరిగారు టీ.టీడీపీ నాయకులు.
చంద్రబాబు వరంగల్ పర్యటనలో భాగంగా ఆ సభలో ఓ టీడీపీ నాయకుడు కేసీఆర్ ను గాంధీతో పోల్చి.నవ్వులు పండించేందుకు ప్రయత్నించాడు.
కొంచెం అతిగా అనిపించినా.సభకు వచ్చిన టీడీపీ కార్యకర్తలు దీన్ని ఎంజాయ్ చేశారు.
కేసీఆర్ ను కొందరు టీఆర్ నేతలు తెలంగాణ గాంధీ అని ముద్దుగా పిలుచుకుంటారు.దీన్ని అస్త్రంగా చేసుకున్నాడో టీడీపీ నేత.కేసీఆర్ ను తెలంగాణ గాంధీ అంటున్నారు.ఇద్దరికీ పోలిక పెడితే ఎలా ఉంటుందో చూద్దామంటూ సెటైర్ స్టార్ట్ చేశాడు.
గాంధీ అహింసా వాదాన్ని చెబితే.ఈ తెలంగాణ గాంధీది అంతా హింసావాదమేనని విమర్శించారు.
దంచుతం.కర్రు కాల్చి వాతలు పెడతం.
ఉరికిస్తాం.ఇలా ఉంటుందీ తెలంగాణ గాంధీ తరహా అని వివరించాడు.
గాంధీజీ తనకు పదవులే వద్దని చెప్పాడు.ఈ తెలంగాణ గాంధీ.
పదవి లేకుంటే నిమిషం ఉండలేడు.తనకే కాదు.
తన కుటుంబంలో అందరికీ పదవులు ఇచ్చుకున్నాడు.పాపం ముసల్ది పెద్దగా లేస్తలేదుగానీ లేకుంటే ఆమెకు కూడా ఏ రాజ్యసభపదవో ఇచ్చేవాడో అని కామెంట్ చేశాడు.
ఇక గాంధీ మద్యం ముట్టకండ్రా అని చెప్పాడు.ఈ తెలంగాణ గాంధీ.
మద్యం ముట్టకుండా గంటసేపు ఉండలేడు.అంటూ కేసీఆర్ వైఖరిని విమర్శించాడు.
ఇలా గాంధీని, కేసీఆర్ ను పోలుస్తూ.చెప్పిన ప్రసంగం వరంగల్ సభలో నవ్వులు పూయించింది.
మరి దీనిపై గులాబీ దళం ఏమంటుందో.