తెలుగుదేశం పార్టీకి చెందిన కీలక నాయకుడు సీనియర్ నేత శాప్ మాజీ చైర్మన్ పీఆర్ మోహన్ ఈరోజు తెల్లవారుజామున గుండెపోటుతో మరణించడం జరిగింది.ఈరోజు ఉదయం ఆయన స్వస్థలం చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో.
సొంత నివాసంలో తుదిశ్వాస విడిచినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.ఈ నేపథ్యంలో టిడిపి పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అదేరీతిలో జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్.
.మోహన్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు.
వాళ్ల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.పార్టీ అధినేత పీఆర్ మోహన్.పార్టీకి ఎనలేని సేవలందించారని… పొగడ్తలతో ముంచెత్తారు.అంతేకాకుండా 2013వ సంవత్సరంలో “వస్తున్నా మీకోసం” అనే పాదయాత్ర విజయవంతం అవడానికి గల ప్రధాన కారణం మోహన్ అని చంద్రబాబు స్పష్టం చేశారు.
కచ్చితంగా మోహన్ మృతి పార్టీకి తీరనిలోటని.ఓ మంచి నాయకుడిని పార్టీ కోల్పోయిందని చంద్రబాబు తెలియజేస్తూ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.నారా లోకేష్ కూడా ఇదే రీతిలో మోహన్ పార్టీకి చేసిన సేవలను కొనియాడుతూ కుటుంబానికి సానుభూతి తెలియజేశారు.