టీడీపీ నేత పత్తిపాటి పుల్లారావు కీలక వ్యాఖ్యలు చేశారు.ఏపీలోని పరిణామాలపై ప్రధాని నరేంద్ర మోదీ జోక్యం చేసుకోవాలని అన్నారు.
రాష్ట్రంలో మూడు రాజధానుల రాజకీయానికి ప్రధాని చెక్ పెట్టాలని కోరారు.కేంద్రం తలుచుకుంటే క్షణాల్లో అమరావతి సమస్య పరిష్కారం అవుతుందని తెలిపారు.
రాష్ట్రంలో వైసీపీ మళ్లీ విభజన రాజకీయం చేస్తోందని ఆయన ఆరోపించారు.ఈ విషయంపై ప్రధాని స్పందించి రాజధానికి పరిష్కారాన్ని చూపాలని పత్తిపాటి వ్యాఖ్యనించారు.