సీఎం వైఎస్ జగన్ ను దూషించిన కేసులో 14 రోజుల రిమాండ్ నిమిత్తం టీడీపీ అధికార ప్రతినిథి పట్టాభిని మచిలీపట్నం సబ్ జైలుకు తరలించారు.ఉదయం నుండి విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి వైద్య పరీక్షల నిమిత్తం, కోర్టులో హాజరుపర్చే సమయంలో పట్టాభి కుంటుతూ నడిచారు.
అయితే రాత్రి మచిలీపట్నం సబ్ జైలులోకి పంపించే క్రమంలో పట్టాభిని పోలీసులు అదరాబాగరగా పరుగులెత్తిస్తూ సబ్ జైలులోకి పంపించడం చర్చనీయాంశమైంది.