గుంటూరు జిల్లా టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ని ఇటీవల పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.సంగం డైరీ లో అవకతవకలకి పాల్పడినట్లు ఏసీబీ అధికారులు గుర్తించి ధూళిపాల నరేంద్ర ని అదుపులోకి తీసుకోవడం జరిగింది.
ఈ పరిణామంతో ధూళిపాల నరేంద్ర హైకోర్టును ఆశ్రయించి క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు.దీంతో హైకోర్టు ధూళిపాల నరేంద్ర వేసిన పిటిషన్ ని తిరస్కరించింది.
అంతేకాకుండా కేసు విచారణ కొనసాగించాలని హైకోర్టు ఏసీబీ అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది.
ఇదే తరుణంలో మే 5వ తారీఖు లోపు అఫిడవిట్ దాఖలు చేయాలని టైం ఫిక్స్ చేసింది.
దీంతో ఏసీబీ అధికారులు సంగం డైరీ అవకతవకలు విషయంలో అఫిడవిట్ దాఖలు చేయడానికి ఏర్పాటు చేసుకుంటున్నారు.మరోపక్క తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు నరేంద్ర ని ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేసిందని కక్షపూరితంగా జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తుంది అని విమర్శిస్తున్నారు.
కనీసం నోటీసులు ఇవ్వకుండా ఆయన అరెస్టు చేయటం ఈ విధంగా ఇబ్బందులపాలు చేయడం సరైన విధానం కాదని ఏపీ ప్రభుత్వంపై మండిపడుతున్నారు.