తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్యెల్సీ నారా లోకేష్ ఓ ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు.కొద్దిపాటి తేడాలో ఆయన ప్రమాదం నుంచి బయటపడ్డారు.
అసలు ఏమైంది అంటే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీకి పాదయాత్రగా వస్తుండగా డ్రోన్ కెమెరా విద్యుత్ తీగలకు తగిలి కింద పడింది.ఒక్కసారిగా ఆ డ్రోన్ తమ పక్కన పడడంతో ఎమ్మెల్సీలు ఉలిక్కిపడ్డారు.
భయంతో ఏం జరిగిందో అర్థంకాక గందరగోళం నెలకొంది.ఈ ప్రమాదంలో ఎవరికీ ఏటివంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఈ సమయంలో నారా లోకేష్ కూడా ఆ డ్రోన్ పడ్డ ప్రదేశానికి అతి సమీపంలోనే ఉన్నారు.
ఈ డ్రోన్ అసలు ఇక్కడకు ఎలా వచ్చింది అనే విషయాన్ని ఆరా తీయగా అసెంబ్లీ ఆవరణలో భద్రత కోసం పోలీసులు ఈ డ్రోన్ కెమెరాను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.
ప్రతి రోజు ఈ డ్రోన్ కెమెరా ద్వారానే పరిసరాల్లో ఏమి జరుగుతుంది అనే విషయాలను తెలుసుకుంటున్నారు.ఈ క్రమంలోనే పైకి ఎగిరిన డ్రోన్ విద్యుత్ తీగలకు తగలడంతో ఒక్కసారిగా కిందపడిపోయింది.
ఈ సంఘటనతో అప్రమత్తమైన పోలీసులు ఆ ప్రదేశం నుంచి డ్రోన్ ను తీసుకెళ్లారు.అయితే ఈ ఘటనపై పోలీసులు సమగ్రంగా విచారణ చేస్తున్నట్టు సమాచారం.