కర్నూలు జిల్లాలో రాజకీయ కక్ష్యలు మళ్ళీ భగ్గుమన్నాయి.జిల్లాలోని బనగానిపల్లి నియెజక వర్గానికి చెందినటువంటి మాజీ మెమ్మెల్యే బీసీ జనార్ధన్ రెడ్డి ముఖ్య అనుచరుడు మంజుల సుబ్బారావు ఈరోజు గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో దారుణ హత్యకు గురైన సంగతి జిల్లాలో కలకలం రేపింది.
వివరాల్లోకి వెళితే మంజుల సుబ్బారావు గత కొంత కాలంగా గ్రనైట్ వ్యాపారం చేస్తున్నారు. అయితే పని నిమిత్తం ఈ రోజు ఉదయం బయటికి వచ్చిన సుబ్బారావుని దుండగులు దారి వెంబడి కాపు కాచి వేట కొడవళ్ళతో అతి కిరాతకంగా నరికారు.
దీంతో తీవ్ర రక్తస్రావానికి గురైన సుబ్బారావు అక్కడిక్కడే మృతి చెందారు. సుబ్బారావు చనిపోయాడన్న విషయం తెలుసుకున్న దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు.
స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని చేరుకొని పరిశీలించారు.అనంతరం మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం దగ్గర్లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.ఈ విషయంపై మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్ధన్ రెడ్డి స్పందిస్తూ మంజుల సుబ్బారావు తనకు అత్యంత ముఖ్యమైన అనుచరుడని అతడి ఎదుగుదల చూసి తట్టుకోలేక తన ప్రత్యర్థులు ఇంతటి అఘాయిత్యానికి ఒడిగట్టింటారని పేర్కొన్నారు.అంతేగాక నిందితులు ఎవ్వరైనా సరే వదిలిపెట్టేది లేదని వారిని కచ్చితంగా చట్టపరంగా శిక్షించే వరకూ పోరాడతామని అన్నారు.
అనంతరం మంజుల సుబ్బారావు కుటుంబానికి సంతాపం తెలియజేశారు.
.