టీడీపీ నేత మృతి.. కడసారి చూపులకు నోచుకోని కొడుకులు

ఏపీలో కరోనా వైరస్ శరవేగంగా వ్యాపిస్తుంది.రోజురోజుకు కరోనా కేసుల పెరుగుతూనే ఉన్నాయి.

 Guntoor, Tdp Leader, Dead-TeluguStop.com

ఈ మహమ్మారి సామాన్య ప్రజల నుండి ప్రజాప్రతినిధుల వరకు ఎవరిని వదిలిపెట్టడం లేదు.ఇప్పటికే ఈ వైరస్ కారణంగా చాల మంది రాజకీయ నాయకులు ప్రాణాలు కోల్పోయారు.

ఇంకా కరోనా బారినపడిన నాయకులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో న్యాచురల్ డెత్ అయినా వైరస్ కారణంగానే చనిపోయారని అనుకుంటున్నారు.

ఈ మహమ్మారి అందరిని అంతలా భయపెట్టింది.ఈ వైరస్ తాజాగా బాపట్లలో అనారోగ్యంతో మరణించిన తండ్రిని కుమారుడు కడసారి చూపులకు నోచుకోకుండా చేసింది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.గుంటూరు జిల్లా బాపట్లకు చెందిన టీడీపీ నేత ఎస్‌కే ఫిష్‌బాబు గుండెపోటుతో మరణించారు.అయితే అతని కుమారుడు ఉద్యోగ రీత్యా విదేశాలకు వెళ్ళాడు.పెద్ద కుమార్తె హైదరాబాద్‌లో చిన్న కుమార్తె గుంటూరు జిల్లాలో నివాసం ఉంటున్నారు.

అయితే తండ్రి మరణ వార్త విన్న కుమారుడు రాలేని పరిస్థితి.అతనికి సకాలంలో రావటానికి విమానాలు అందుబాటులో లేకపోవటంతో తండ్రి అంత్యక్రియల్లో పాల్గొనలేని పరిస్థితి ఎదురైంది.

అంతేకాక బాపట్లలో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి.దీంతో కొడుకు వచ్చే వంతవరకు మృతదేహాన్ని ఉంచే పరిస్థితి లేదు.

దింతో ఫిష్‌బాబు మృతదేహానికి బంధువులు అంత్యక్రియలు నిర్వహించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube