టీడీపీ నేత, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన తనయుడు జేసీ అస్మిత్ రెడ్డిలకు బెయిల్ దొరికింది.బుధవారం అనంతపురం జిల్లా కోర్టు ఇద్దరికి బెయిల్ మంజూరు చేసింది.గురువారం కడప జిల్లా జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.బీఎస్-3 వాహనాలను బీఎస్-4 వాహనాలుగా మార్చి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారనే అభియోగంపై జేసీ ప్రభాకర్ రెడ్డిపై కేసు నమోదు అయింది.ఇదే కేసులో నకిలీ ఇన్సూరెన్స్ పత్రాలు తయారు చేశారన్న అభియోగంపై జేసీ ప్రభాకర్ రెడ్డి తనయుడు అస్మిత్ రెడ్డిపై అనంతపురం వన్ టౌన్ పోలీసు స్టేషన్ లో కేసు నమోదు అయింది.
జూన్ 13వ తేదీన హైదరాబాద్లోని శంషాబాద్లో జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డిలను వారి నివాసంలో పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
వీరిని కస్టడీలోకి తీసుకున్న పోలీసులు ఇద్దరిని అనంతపురం కడప జిల్లాకు తరలించారు.