ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల లో వైసీపీ పార్టీ మద్దతుదారులు భారీగా గెలవడానికి కారణం అధికారమని టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి పేర్కొన్నారు.వైసీపీ అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రత్యర్థులను పోలీసుల చేత భయబ్రాంతులకు గురి చేసి గెలిచిందని ఆరోపించారు.
భారీగా డబ్బు ను పంచాయతీ ఎన్నికలలో వైసీపీ నేతలు పంచటం వల్లే ఈ రీతిగా ఫలితాలు వచ్చినట్లు స్పష్టం చేశారు.కుప్పం నియోజకవర్గంలో కూడా చంద్రబాబు ఓడిపోవడం నిజంగా విడ్డూరమని జేసీ దివాకర్ రెడ్డి పేర్కొన్నారు.
అన్ని రీతులుగా కుప్పం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన ఘనత చంద్రబాబుది అని స్పష్టం చేశారు.అటువంటి చోట కూడా వైసీపీ గెలిచింది అంటే ఏ విధంగా డబ్బులు పంచారో.అధికారాన్ని ఏవిధంగా అడ్డం పెట్టుకున్నారో అర్థం అవుతుంది అని స్పష్టం చేశారు.ప్రజలలో… బయట రోజుకీ జగన్ ఆదాయం 300 కోట్ల సంపాదన అనే టాక్ వినబడుతోంది, అది ఎంత వరకు నిజమో నాకు తెలియదు పైన భగవంతుడికి ఇక జగన్ మోహన్ రెడ్డి కే తెలియాలి అంటూ సరికొత్త ఆరోపణ జేసీ దివాకర్ రెడ్డి జగన్ పై చేశారు.దీంతో జడ్పీటీసీ, ఎంపీటీసీ అదేవిధంగా మున్సిపల్ ఎన్నికల్లో కూడా వైసీపీ గెలవడం గ్యారెంటీ అని.డబ్బులు ఆ విధంగా పంచుతారు అన్నట్టు జెసి దివాకర్ రెడ్డి పేర్కొన్నారు.