తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు కష్టకాలం మొదలయినట్టు కనిపిస్తోంది.మరో కొద్ది నెలల్లో ఎన్నికలు రాబోతుండడం… వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలిచే అవకాశాలు ఉన్నట్టు అనేక సర్వేలు ఇప్పటికే ట్లేచేయడంతో ఒక్కొక్కరు టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చేందుకు సిద్ధం అవుతున్నారు.
ఈ కోవలోనే వైసీపీ నుంచి టీడీపీలో చేరిన గుర్నాథరెడ్డి టీడీపీకి రామ్ రామ్ చెప్పేందుకు సిద్ధం అవుతున్నాడు.ఈ మేరకు ఆయన మాట్లాడుతూ….
‘చంద్రబాబునాయుడు పాలన బాగుందని టీడీపీలో చేరి తప్పుచేశా’నని మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి అన్నారు.ఆదివారం అనంతపురంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.నాతోపాటు ఐదుగురు కార్పొరేటర్లు కూడా టీడీపీకి రాజీనామా చేస్తున్నారని గురునాథరెడ్డి తెలిపారు.అలాగే చంద్రబాబునాయుడు ప్రజల్లో విశ్వాసం కోల్పోయారని విమర్శించారు.త్వరలో నా రాజకీయ భవిష్యత్ ప్రకటిస్తాను అంటూ గుర్నాథరెడ్డి వెల్లడించారు.