ఏపీ రాజకీయాలలో రోజుకో మలుపు తిరుగుతూ ఎన్నికల ముందు రాజకీయ వాతావరణం ప్రజలకి విపరీతమైన ఆసక్తి కలిగిస్తుంది.టీడీపీ అధినేత చంద్రబాబు వైసీపీ నుంచి పార్టీలోకి వచ్చిన వారికి టికెట్స్ ఇవ్వడానికి రెడీ అవుతూ వుంటే, అలాగే టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్ళిన వారికి వైసీపీ అధినేత జగన్ టికెట్స్ ఇవ్వడానికి ఆసక్తి చూపించడంతో మొదటి నుంచి పార్టీలని నమ్ముకొని వున్నా స్థానిక నాయకులలో అసంతృప్తి సెగలు రాజుకుంటున్నాయి.
తాజాగా ప్రాణ్యం నియోజక వర్గంలో వైసీపీ నుంచి టీడీపీలో చేరడానికి రెడీ అవుతున్న వైసీపీ ఎమ్మెల్యే గౌరు చరితకి టీడీపీ అధినేత ఎమ్మెల్యే సీటు ఇచ్చేందుకు రెడీ అవుతూ చంద్రబాబు టికెట్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు.ఈ నేపధ్యంలో మొదటి నుంచి పార్టీని నమ్ముకొని వున్న ప్రాణ్యం నియోజకవర్గం టీడీపీ నేత ఏరాసు ప్రతాప్ రెడ్డి అధినేతపై తీవ్ర అసంతృప్తి వున్నట్లు తెలుస్తుంది.
తనకి కాకుండా గౌరు చరితకి సీటు ఇస్తే తాను టీడీపీ వీడే అవకాశాలు వున్నాయని తెలుస్తుంది.మరి ఈ ఎన్నికల రాజకీయం ఓ వైపు టీడీపీ, వైసీపీ పార్టీలకి తలనొప్పి గా మారుతూ వుంటే, ప్రజలకి మాత్రం ఆసక్తికరంగా కనిపిస్తుంది.