అధినేతపై అసంతృప్తి తో ఏరాసు ప్రతాప్ రెడ్డి టీడీపీకి మరో దేబ్బ..!

ఏపీ రాజకీయాలలో రోజుకో మలుపు తిరుగుతూ ఎన్నికల ముందు రాజకీయ వాతావరణం ప్రజలకి విపరీతమైన ఆసక్తి కలిగిస్తుంది.టీడీపీ అధినేత చంద్రబాబు వైసీపీ నుంచి పార్టీలోకి వచ్చిన వారికి టికెట్స్ ఇవ్వడానికి రెడీ అవుతూ వుంటే, అలాగే టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్ళిన వారికి వైసీపీ అధినేత జగన్ టికెట్స్ ఇవ్వడానికి ఆసక్తి చూపించడంతో మొదటి నుంచి పార్టీలని నమ్ముకొని వున్నా స్థానిక నాయకులలో అసంతృప్తి సెగలు రాజుకుంటున్నాయి.

 Tdp Leader Erasu Prathap Reddy Disappointed On Chandrababu Naidu-TeluguStop.com

తాజాగా ప్రాణ్యం నియోజక వర్గంలో వైసీపీ నుంచి టీడీపీలో చేరడానికి రెడీ అవుతున్న వైసీపీ ఎమ్మెల్యే గౌరు చరితకి టీడీపీ అధినేత ఎమ్మెల్యే సీటు ఇచ్చేందుకు రెడీ అవుతూ చంద్రబాబు టికెట్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు.ఈ నేపధ్యంలో మొదటి నుంచి పార్టీని నమ్ముకొని వున్న ప్రాణ్యం నియోజకవర్గం టీడీపీ నేత ఏరాసు ప్రతాప్ రెడ్డి అధినేతపై తీవ్ర అసంతృప్తి వున్నట్లు తెలుస్తుంది.

తనకి కాకుండా గౌరు చరితకి సీటు ఇస్తే తాను టీడీపీ వీడే అవకాశాలు వున్నాయని తెలుస్తుంది.మరి ఈ ఎన్నికల రాజకీయం ఓ వైపు టీడీపీ, వైసీపీ పార్టీలకి తలనొప్పి గా మారుతూ వుంటే, ప్రజలకి మాత్రం ఆసక్తికరంగా కనిపిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube