ఏపీ మంత్రి కొట్టు సత్యనారాయణకు టిడిపి నేత చింతమనేని ప్రభాకర్ సవాల్ విసిరారు.తాడేపల్లిగూడెంలో అమరావతి రాజధాని రైతుల పాదయాత్రకు వ్యతిరేకంగా వెలసిన పోస్టర్లపై ఆయన స్పందించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ పాదయాత్ర ఫేకో.మంత్రి సత్యనారాయణ ఫేకో ప్రజలే తేలుస్తారన్నారు.
పాదయాత్రకు ప్రజలు స్వచ్ఛందంగా వస్తున్నారని తెలిపారు.మంత్రి కొట్టు సత్యనారాయణకు దమ్ముంటే రైతుల పాదయాత్రలో పాల్గొన్న ప్రజల కంటే ఎక్కువమందితో తాడేపల్లిగూడెం ఫ్లైఓవర్ పై నిరసన తెలపాలని లంచ్ చేశారు.
మంత్రి పదవి ఊడిపోతుందన్న భయంతోనే ఇలాంటి ఫ్లెక్సీలు ఏర్పాటు చేయించారని, దీన్ని ఎవరు హర్షించారని చింతమనేని వ్యాఖ్యానించారు.