పార్లమెంట్ లో అడుగుపెట్టాలన్న ఆయన కల నెరవేరడం లేదు.లోక్ సభ ఎన్నికల్లో గెలిచి ఎంపీ అవ్వాలన్న ఆయన కోరిక ఫలించడం లేదు.
మూడు సార్లు బరిలోకి దిగినా ఆయనకు నిరాశే ఎదురైంది.పార్టీలు మారితే అదృష్టం కలిసి వస్తుందని మూడు సార్లు పార్టీ మారారు.
అయినా ఫలితం శూన్యం.కానీ ఆయన పట్టు వదలలేదు.
పార్లమెంట్ లో అడుగుపెట్టాలన్న ఆయన కల కోసం అదృష్టాన్ని మరోమారు పరీక్షించుకుంటున్నారు.ప్రస్తుతం ఆ టీఆర్ఎస్ పార్టీ నాయకుడు వైసీపీలో చేరనున్నారని సమాచారం.
తూర్పు గోదావరి జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ నేత చలమల శెట్టి సునీల్ వైసీపీ పార్టీలో చేరునున్నారు.సోమవారం (ఈ రోజు) ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరనున్నారు.2019లో ఏపీ లోక్ సభ ఎన్నికల్లో చలమలశెట్టి సునీల్ కాకినాడ పార్లమెంట్ స్థానం నుంచి టీడీపీ తరఫున పోటీ చేశాడు.అప్పుడు వైఎస్సార్ సీపీ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన వంగా గీత చేతిలో ఓడిపోయారు.
దీంతో చలమలశెట్టి సునీల్ టీడీపీకి దూరంగా ఉంటున్నారు.వైసీపీతో మంతనాలు జరిపి 2020లో రాష్ట్రం నుంచి రాజ్యసభకు ఓ స్థానం ఖాళీ అవుతోంది.
దీంతో సునీల్ అధికార పార్టీలో చేరినట్లు సమాచారం.ఇప్పటికే చలమలశెట్టి సునీల్ ను ఈ రాజ్యసభ స్థానంలో అవకాశం కల్పించనున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.