టీడీపీ నేత బుద్ధా వెంకన్న కీలక వ్యాఖ్యలు చేశారు.తమ పార్టీ అధినేత చంద్రబాబు రోడ్ షోకు బీసీల విశేష ఆదరణ లభిస్తుందని చెప్పారు.
అందుకే సీఎం జగన్ కు బీసీలు గుర్తుకు వచ్చారన్నారు.కొంగ జపం చేసినా బీసీలు జగన్ వెంట వెళ్లరని తెలిపారు.
చంద్రబాబు హయాంలో పెట్టిన జయహో బీసీ పేరుని కాపీ కొట్టారని పేర్కొన్నారు.ఉత్తరాంధ్రలో ఉన్న బీసీ నాయకత్వాన్ని దెబ్బకొడుతున్నారని ఆరోపించారు.
రెండు రాష్ట్రాలు కలిస్తే బాగుండని జరగని పని గురించి మాట్లాడుతున్నారని వెల్లడించారు.అమర్ రాజా సంస్థ కూడా పక్క రాష్ట్రానికి వెళ్లిపోయిందని విమర్శించారు.