ఏపీ సీఎం జగన్పై టీడీపీ సీనియర్ లీడర్ బుచ్చయ్య చౌదరి తీవ్ర వ్యాఖ్యలు చేశాడు.ఐఆర్ఎస్ అధికారి కృష్ణ కిశోర్ను సస్పెండ్ చేయడంపై ఆయన మండి పడ్డాడు.
జగన్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నాడు అని, ఆయన చేసిన పనితో జాతీయ స్థాయిలో కూడా ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందంటూ ఆయన అభిప్రాయం వ్యక్తం చేశాడు.ఒక ప్యాక్షన్ నేత సీఎం అయితే ఎలా ఉంటుందో ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితి అలాగే ఉంది అంటూ ఆయన పేర్కొన్నాడు.
రాష్ట్రం దురదృష్టమో లేదంటే రాష్ట్ర ప్రజల దురదృష్టమో కాని ప్రస్తుతం రాష్ట్రం చాలా గడ్డు కాలంను ఎదుర్కొంటుంది అంటూ చెప్పుకొచ్చాడు.అధికారం దక్కించుకున్నా కూడా ఇంకా ప్యాక్షన్ మనస్థత్వంను వదలని సీఎం జగన్ ఇకపై అయినా తాను ఒక ముఖ్యమంత్రిని అనే విషయాన్ని గుర్తిస్తాడని ఆశిస్తున్నాను అన్నాడు.
జగన్ చేస్తున్న ప్యాక్షన్ రాజకీయాలు వదిలేయకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి ఉంటుందని, ప్రజలు తగిన గుణపాఠం చెప్తారంటూ హెచ్చరించాడు.