పోలీసులతో బూట్లు నాకిస్తాం... జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

మాజీ ఎమ్మెల్యే జేసీ దివాకర్ రెడ్డి మాట తీరు ఎప్పుడు వివాదాస్పదంగానే ఉంటుంది.ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని మావాడు అంటూ సంబోధిస్తూ ఒక్కోసారి ప్రశంసలు కురిపిస్తూ అంతలోనే మరోసారి ఘాటుగా విమర్శలు చేస్తారు.

 Tdp Jcdiwakar Reddy Chandrababu Naidu Ys Jagan-TeluguStop.com

జగన్ పాలనలో రెడ్డిలకి న్యాయం చేస్తున్నాడు.వారికి పదవులు ఇస్తున్నాడు అని ఆ మధ్య వ్యాఖ్యలు చేసిన జేసీ దివాకర్ రెడ్డి మరో సారి సంచలన వ్యాఖ్యలు చేసారు.

టీడీపీ పాలనలో చంద్రబాబు శాంతి, శాంతి అంటూ అందరిని నాశనం చేసాడని అనంతరపురంలో చంద్రబాబు సభలోనే నేరుగా వ్యాఖ్యలు చేశారు.ఇప్పుడు జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత అతని అండ చూసుకొని వైసీపీ వాళ్ళు చిన్న చిన్న కార్యకర్తలను కూడా బెదిరిస్తున్నారని అన్నారు.

ఇక జగన్ పాలన గురించి సామాన్య ప్రజలు అద్బుతంగా ఉందని మెచ్చుకుంటున్నారని, స్టేజ్ మీద ఉన్న మనం మాత్రమే బాగోలేదని అంటూ ఉన్నామని అన్నారు.జగన్ అరాచక పాలనలో జనంలోకి తీసుకెళ్ళే అవకాశం ఇప్పటికైనా చంద్రబాబు ఇవ్వాలని, శాంతి వచనాలు, గాంధీ మాటలు చెప్పి కార్యకర్తలని కంట్రోల్ చేయొద్దని హితవు పలికారు.

అదే సమయంలో ఏపీ పోలీసుల మీద కూడా జీసీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.జగన్ కి అధికారం శాశ్వతం కాదని మరో రెండున్నరేళ్ళలో ఎన్నికలు వస్తాయని, అప్పుడు తాము అధికారంలోకి వస్తాయని ఇప్పుడు జగన్ బూట్లు నాకుతున్న పోలీసులని తీసేసి తమ బూట్లు నాకే పోలీసులను తెచ్చుకుంటామని వ్యాఖ్యానించారు.

ఈ వ్యాఖ్యలు ఇప్పుడు మీడియాలో ప్రముఖంగా రావడంతో ఒక్కసారిగా వివాదాస్పదం అయ్యాయి.మరి ఈ వ్యాఖ్యలపై పోలీసు సంఘాలు ఎలా స్పందిస్తాయి అనేది వేచి చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube