ఏపీలో నేటి నుంచి టీడీపీ-జనసేన సమన్వయ సమావేశాలు

ఏపీలో టీడీపీ – జనసేన అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయ సమావేశాలు ప్రారంభంకానున్నాయి.ఈ మేరకు ఇవాళ్టి నుంచి మూడు రోజులపాటు ఈ సమావేశాలు జరగనున్నాయి.

 Tdp-janasena Coordination Meetings In Ap From Today-TeluguStop.com

రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలలో ఈ సమావేశాలను నిర్వహించనున్నారు.భవిష్యత్ కు గ్యారెంటీతో పాటు ఓటర్ లిస్టు వెరిఫికేషన్ పై నేతలు ప్రధానంగా చర్చించనున్నారు.

అదేవిధంగా క్షేత్రస్థాయిలో చేపట్టాల్సిన కార్యక్రమాలే ఎజెండాగా సమావేశాలు జరగనున్నాయి.ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంఛార్జ్ లతో పాటు రెండు పార్టీలకు చెందిన ముఖ్యనేతలంతా ఈ సమన్వయ సమావేశాల్లో పాల్గొని కీలక అంశాలపై చర్చిస్తారు.

ఈ క్రమంలో విశాఖ పశ్చిమ నియోజకవర్గం, భీమిలి, గాజువాక, విశాఖ ఉత్తరం తరువాత విశాఖ తూర్పు, దక్షిణ నియోజకవర్గాల్లో సమావేశాలు నిర్వహించనున్నారు.అయితే ఇప్పటికే ఉమ్మడి జిల్లాల వారీగా సమన్వయ సమావేశాలు జరిగిన సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube