రాజకీయ వ్యూహాలు పన్నడంలో చంద్రబాబు మహా దిట్ట.ఆయనకు రాజకీయ చాణక్యుడు అనే బిరుదు కూడా ఉందంటే ఎంతలా వ్యూహాలను అమలు చేసి విజయం సాధించగలరో అర్థంచేసుకోవచ్చు.
అలాంటి వ్యూహ చతురత ఉంది కాబట్టే అవసరానికి తగ్గట్టు రాజకీయాలు చేస్తుంటారు.తనకు అవసరం అనుకుంటే ఎవరినైనా కలుపుకుపోవడంలో చంద్రబాబుది పైచేయి.
గతంలో చూసుకుంటే పవన్ను ఆధారంగా చేసుకుని ఏపీలో 2014 ఎన్నికల్లో పొత్తు పెట్టుకుని మరీ పోటీ చేశారు.ఆ ఎన్నికల్లో విజయం కూడా సాధించారు.
అయితే ఆ తర్వాత ఇద్దరూ విడిపోయి తర్వాత ఎన్నికల్లో ఎవరికి వారే పోటీ చేశారు.
పవన్ కళ్యాణ్ ఏపీలో బలమైన సామాజికవర్గానికి చెందిన నేతగా ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నారు.
అందుకే ఆయన్ను ఒకప్పుడు టీడీపీ ఇప్పుడు బీజేపీ మచ్చిక చేసుకున్నాయి.ఆయన్ను ఆసరాగా చేసుకని ఒకప్పుడు టీడీపీ అధికారంలోకి వస్తే ఆ తర్వాత బీజేపీ ఆయన్ను ఆధారంగా చేసుకుని బలపడేందుకు ప్రయత్నిస్తోంది.
ఇక ఇప్పుడు పవన్ కూడా వైసీపీ మీద బాగానే విరుచుకుపడుతున్నారు.ఆయన ఎన్నికల్లో ఓడిపోయిన కూడా ఆయన ఇమేజ్ మాత్రం ప్రజల్లో ఇంకా ఉంది.
జాతీయ స్థాయిలో అధికారంలో ఉన్న బీజేపీ ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయిన పవన్తో పొత్తు పెట్టుకుందంటేనే ఆయన చరిష్మా ఏంటో అర్థం చేసుకోవచ్చు.
ఇకపోతే టీడీపీ కూడా చాలా రోజులుగా తమ బలం సరిపోవట్లేదని అందుకే ఏదో ఒక పార్టీతో కలిసి ముందుకు వెళ్లాలనే ఆలోచనలో ఉంది.ఇందుకోసం జనసేనతో మళ్లీ పొత్తు పెట్టుకోవాలని టీడీపీ భావిస్తోంది.పవన్ తమకు మిత్రుడు అని తెలుగుదేశం నేతలు కూడా చాలాసార్లు ఇదే భావనలో ఉంటున్నారు.
పవన్ తమకు మద్దతు ఇస్తే రాబోయే ఎన్నికల్లో కచ్చితంగా విజయం సాధిస్తామనే నమ్మకంతో ఉంది టీడీపీ అధినాయకత్వం.పవన్ మీద బోలెడు ఆశలతో ఉన్న టీడీపీకి పవన్ మాత్రం మద్దతు ఇచ్చే ప్రసక్తి లేదనే కనిపిస్తోంది.
ఇంకా పొత్తులు పెట్టుకుంటే తన ఇమేజ్ దెబ్బ తింటుందని అందుకే ఒంటరిగానే పోటీ చేయాలని భావిస్తోందంట.