ఏపీలో బీజేపీతో పొత్తు పెట్టుకోవాలనేది తెలుగుదేశం పార్టీ ఆకాంక్ష .ఎప్పటి నుంచో ఈ దిశగా ప్రయత్నాలు చేస్తున్నా, కమలనాథులు మాత్రం టిడిపిని దూరం పెడుతూ వస్తున్నారు.
చంద్రబాబుకు అత్యంత సన్నిహితులుగా రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్, సుజనా చౌదరి వంటి వారు బిజెపిలో చేరినా, టిడిపి భక్తులు గానే వారు ముద్రపడ్డారు.వారి ద్వారా చంద్రబాబు బిజెపితో పొత్తు కోసం ప్రయత్నిస్తున్నారు అనే అనుమానాలు రాజకీయ వర్గాల్లోనూ ఉన్నాయి.
ఎవరు ఎంతగా ప్రయత్నాలు చేస్తున్నా, టిడిపితో ఎప్పటికీ కలిసేది లేదు అంటూ ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తో పాటు, కేంద్ర బిజెపి పెద్దలు అనేకమార్లు ఈ పొత్తు అంశంపై స్పందించారు.అయినా, చంద్రబాబు మాత్రం ఆర్ఎస్ఎస్ ద్వారానో లేక బిజెపి లోని కొంత మంది సన్నిహితులు ద్వారానో పొత్తు కోసం ప్రయత్నాలు చేస్తూనే వస్తున్నారు.
ఇదిలా ఉంటే వైసిపి బీజేపీతో వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే బీజేపీ టీడీపీ మధ్య పొత్తు ఏర్పడేలా వైసీపీ ప్రయత్నాలు చేస్తున్నట్లుగా కనిపిస్తోంది.కొద్ది రోజుల క్రితం ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు జగన్ కు లేఖ రాశారు.
మాంసం ,చేపలు అమ్మకాలను ప్రభుత్వం చేపట్టాలన్న జగన్ నిర్ణయంపై ఆయన అభ్యంతరం తెలిపారు.ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ సోము వీర్రాజు డిమాండ్ చేశారు.దీనిపై వైసీపీ మంత్రి అప్పలరాజు స్పందించారు.తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆ లేఖ తయారైందని , చంద్రబాబు చెప్పినట్లు నడుచుకుంటున్నారని విమర్శించారు.
జగన్ కు ప్రత్యేక హోదా కోసం సోము వీర్రాజు ప్రధాని నరేంద్ర మోదీ కి లేఖ రాస్తే మంచిది అంటూ అప్పలరాజు సూచించారు.
ఈ తరహా వ్యవహారాల కారణంగా బిజెపి టిడిపి ఉమ్మడిగా వైసీపీని ఎదుర్కోవాలనే అభిప్రాయం వస్తే ఎక్కువగా నష్టపోయేది మాత్రం వైసీపీనే.ఇప్పటికే ఏపీలో బీజేపీ ,టిడిపి జనసేన పార్టీలు పొత్తు పెట్టుకోబోతున్నాయనే ప్రచారం జరుగుతున్న క్రమంలో వైసిపి ఈ విధంగా చేయడం వల్ల లాభపడేది ఆ మూడు పార్టీలే అనేది విశ్లేషకుల అభిప్రాయం.
తాజా వార్తలు