మాజీ ఎంపీ మురళీమోహన్ సినిమా ఇండస్ట్రీలో నటుడిగా మాత్రమే కాక రాజకీయాల్లో టిడిపి పార్టీలో కీలక నేతగా రాణించాడు.పొలిటీషియన్ గా, నటుడిగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా సత్తా చాటారు.2009వ సంవత్సరంలో ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన మురళీమోహన్ 2014లో విజయం సాధించారు.కాగా గెలిచిన తర్వాత ఎక్కువగా ఢిల్లీ, హైదరాబాద్ ప్రాంతాలకే పరిమితం కావడంతో మురళీ మోహన్ పై సొంత నియోజకవర్గంలో అప్పట్లో విమర్శలు వచ్చాయి.
ఇదిలా ఉంటే ప్రస్తుతం రాజమండ్రిలో ఆయన కోడలు రూపాదేవి పార్టీలో కీలకంగా రాణిస్తున్నారు.ఇదిలా ఉంటే వెన్నెముకకు శాస్త్ర చికిత్స జరగడంతో చాలావరకు సైలెంట్ అయిపోయింది మురళీమోహన్ ఇటీవల ఒక ప్రముఖ తెలుగు దిన పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు.
మేటర్ లోకి వెళ్తే రాజకీయాలకు గుడ్ బై చెప్పేసినట్లు స్పష్టం చేశారు.అంతేకాకుండా భవిష్యత్తులో మళ్లీ సినిమాలు చేయబోతున్నట్లు.సొంత బ్యానర్ జయభేరి ఆర్ట్స్ పై సినిమాలు నిర్మించనున్నట్లు స్పష్టం చేశారు.