బిజెపి, జనసేన ఊహించనంత స్థాయిలో తిరుపతి సభ సక్సెస్ అయింది.పవన్ సభకు లక్షలాది మంది పోటెత్తారు.
పవన్ ప్రసంగం తో తిరుపతిలో జనసేన, బిజెపి నాయకుల్లో ఊపు వచ్చింది.దీంతో బిజెపి, జనసేన పార్టీలు రెండు పవన్ పర్యటన తర్వాత ఉత్సాహం తో ఉన్నట్టుగా కనిపించాయి.
పవన్ తన వాడివేడి ప్రసంగాలతో ప్రధాన ప్రత్యర్థి అయిన వైసీపీ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశాయి.తిరుపతి వెంకన్నకు ముడిపెట్టి మరి, వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఓటర్లను ఆలోచించుకోవాలి అంటూ తన ప్రసంగాలతో ఆకట్టుకున్నారు.
ఈ సభ సక్సెస్ కావడంతో బిజెపి జనసేన తో పాటు, అధికార పార్టీ వైసీపీ కూడా సంతోషంగా ఉంది.ఎందుకంటే పవన్ పూర్తిగా టార్గెట్ చేసిన బలిజ ఓటు బ్యాంకు చాలావరకు టిడిపి కి అనుకూలంగా ఉందని, కానీ పవన్ పర్యటన తర్వాత ఓటు బ్యాంకు జనసేన ద్వారా బీజేపీకి అనుకూలంగా మారితే, ఆ ఓట్లు తమకు కలిసి వస్తాయని, వైసిపి టిడిపిలో ఆందోళన మొదలైంది.పార్టీ కేడర్ ఇప్పటికే నిరాశా నిస్పృహల్లో ఉన్నారు.అలాగే పరిషత్ ఎన్నికలు సైతం టిడిపి బహిష్కరించింది.ఈ సమయంలో తిరుపతిలో పట్టు సంపాదించుకోవాలని , పూర్తిగా అన్నిటినీ పక్కనబెట్టి తిరుపతి పైన ఫోకస్ పెంచింది .లోకేష్ తో పాటు ,టిడిపి నాయకులు అంతా తిరుపతిలోనే మకాం వేసి మరి పార్టీ అభ్యర్థికి విజయం సాధించి పెట్టాలని చూస్తున్నారు.కానీ పవన్ ప్రచారంతో ఓటుబ్యాంకు పూర్తిగా బిజెపికి వెళ్ళిపోతే, టిడిపి పరిస్థితి మరింత దారుణంగా తయారవుతుందని అధికార పార్టీకి మేలు చేస్తాయని టిడిపి విశ్లేషించుకుంటూ ఉంది. బలిజ యూత్ ఎక్కువగా పవన్ వెంట నడుస్తూ ఉండటం తో, ఇప్పటి వరకు వారి మద్దతు తమకు ఉంటుందో లేదో అని బిజెపి, టిడిపిలో ఆందోళన చెందుతూ వచ్చాయి .పవన్ ప్రచారానికి రాకపోతే ఆ ఓటు బ్యాంకు టీడీపీకి అనుకూలంగా ఉండేది.కానీ పవన్ తిరుపతి బిజెపి అభ్యర్థి రత్నప్రభ ను గెలిపించాలని తన వాడి వేడి ప్రసంగాలతో ఎన్నికల ప్రచారం నిర్వహించడం తో, వైసీపీ కంటే టిడిపినే ఎక్కువ ఆందోళన చెందుతోంది.