ఏలూరు మాజీ పార్లమెంటు సభ్యులు టిడిపి నాయకుడు మాగంటి బాబు తనయుడు మాగంటి రాంజీ మరణించటంతో జిల్లా టిడిపి క్యాడర్ లో విషాదఛాయలు అలుముకున్నాయి.పశ్చిమగోదావరి జిల్లాలో రాజకీయంగా ఎంతో పలుకుబడి ఉన్న మాగంటి కుటుంబానికి మంచి ట్రాక్ రికార్డ్ ఉంది.
విభజన జరగక ముందు ఈ కుటుంబం నుండి చాలా మంది నేతలు కాంగ్రెస్ పార్టీలో ఉండగా విభజన జరిగిన తర్వాత మాగంటి బాబు టిడిపిలో జాయిన్ అయ్యి 2014 ఎన్నికలలో ఎంపీగా గెలవడం జరిగింది.
అటువంటి కుటుంబం నుండి నెక్స్ట్ రాజకీయాల్లో కీలకంగా ఎదుగుతున్న యువనేత మాగంటి రాంజీ గత కొన్ని రోజుల నుండి అనారోగ్యంతో బాధపడుతూ ఉన్న తరుణంలో విజయవాడ హాస్పిటల్ లో జాయిన్ చేయడం జరిగింది.
చిన్న వయసే కావటంతో చాలామంది రాంజీ.పూర్తిగా ఆరోగ్యంగా కోలుకొని బయట ప్రపంచంలో అడుగు పెడతారు అని భావించాలి.కాని ఇంతలోనే ఆయన మరణించినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించడంతో జిల్లా టిడిపి యంత్రాంగంతో పాటు చాలా మంది ప్రముఖ నేతలు షాక్ అయ్యారు.ఇదిలా ఉంటే మాగంటి రాంజీ అనారోగ్యానికి.
గల కారణం ఏంటో ఇంత వరకు బయటికి రాలేదు.ఒకపక్క ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు జిల్లాలో వార్తలు వైరల్ అవుతూ ఉన్నాయి.