తెదేపా మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఓ కార్యక్రమంలో భాగంగా తాజాగా మీడియాతో మాట్లాడుతూ మోడీ ప్రభుత్వంపై ప్రశంసల జల్లు కురిపించారు.ప్రస్తుతం దేశమంతా కూడా మోడీ హవా కొనసాగుతుందని, అందుకే పలు పార్టీల నేతలు సైతం మోడీవైపే చూస్తున్నారని చెప్పుకొచ్చారు.
అందుకు మోడీ పాలన, ఆయన తీసుకువచ్చిన పథకాలే కారణం.ఏపీలోని తెదేపా నేతలు చాలామంది కూడా బీజేపీలో చేరారు.
అందుకు చంద్రబాబు చేసిన కొన్ని తప్పులే కారణం,
ఇతర ప్రాంతీయ నేతలు కూడా మోడీతో సఖ్యత కుదుర్చుకుంటున్నారు, మోడీ మంచి పరిపాలన వల్లనే అంతా కూడా మోడీ జపం చేస్తున్నారు.త్వరలో జమిలి ఎన్నికలు తీసుకురావడానికి మోడీ చాలా ప్రయత్నాలు చేస్తున్నారు.
జమిలి ఎన్నికలు వస్తే ఇక ప్రాంతీయ పార్టీల పని అయిపోయినట్టే.జమిలి ఎన్నికల నేపథ్యంలో ఈ పార్టీల మనుగడ కష్టమే అంటూ జేసీ చెప్పుకొచ్చారు.