ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వీడియోను మార్ఫ్ చేసి సదరు వీడియోను మాజీ మంత్రి దేవినేని ఉమా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.ఆ వీడియోలో తిరుపతి నగరాన్ని కించపరిచినట్టు జగన్ మాట్లాడినట్లు వీడియో ని ఎడిట్ చేశారు.
అంతేకాకుండా తిరుపతి ఉప ఎన్నికల నేపథ్యంలో మీడియా సమావేశం పెట్టి మరీ ఆ వీడియో ని చూపించి దేవినేని ఉమా తీవ్ర వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే అదంతా రాంగ్ అని 2014 ఎన్నికల టైంలో జగన్ అన్న మాటలను వక్రీకరించి ఎడిట్ చేసి దేవినేని ఉమా జనాల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు అంటూ ఆయన పై Cid ఈ నెల 10 వ తారీఖున 464, 465, 468, 469, 470, 471, 505, 120 (బి) సెక్షన్ల కింద కేసులు నమోదు అయిన సంగతి తెలిసిందే.
దీంతో నోటీసులు ఇచ్చిన క్రమంలో .అప్పట్లో అజ్ఞాతంలోకి దేవినేని ఉమా వెళ్లిపోవడం జరిగింది.అయితే ఈ కేసు విషయంలో ఇటీవల హైకోర్టు కలుగజేసుకోవటం తో .విచారణకు హాజరు కావాలని దేవినేని ఉమా కి ఆదేశాలు ఇవ్వడంతో ఈ రోజు మంగళగిరి సిఐడి కార్యాలయంలో విచారణకు హాజరు అవుతున్నారు.మరోపక్క హైకోర్టులో దేవినేని ఉమా వేసిన క్వాష్ పిటిషన్ పై కూడా విచారణ జరగనుంది.