చంద్రబాబు కి ఇప్పుడు కంటి మీద కునుకు పాడడం లేదు.మొన్నటివరకు టీడీపీ కి వైసీపీ అధినేత జగన్ చుక్కలు చూపించేవాడు.
అసెంబ్లీలోనూ .బయట ప్రబుతువాన్ని ఇరుకున పెడుతూ ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉండేవాడు.కానీ ఇప్పుడు ఆయన పాదయాత్ర పేరుతో జనాల్లో తిరుగుతుండడంతో సాధారణ విమర్శలే చేస్తున్నాడు తప్ప ఇదివరకు అంతటి తీవ్రత అయితే లేదు.ఇప్పుడు ఆ లోటును ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తీసుకున్నాడు.
టెక్నీకల్ గా చంద్రబాబు ను ఇరుకునపెట్టడంలో విజయసాయి రెడ్డి సమర్ధవంతంమైన పాత్ర పోషిస్తున్నాడు.
టీటీడీలో జరుగుతున్న అవకతవకలపై విమర్శలు గుప్పించిన మాజీ ప్రధాన అర్చకులు రమణదీక్షితులకు – వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై చర్యలకు టీటీడీ ఉపక్రమించింది.వాళ్లు చేసిన ఆరోపణలకు వివరణ ఇవ్వాలంటూ ఇద్దరికి నోటీసులు జారీచేసింది.అయితే వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి దీన్ని చాలా క్యాజువల్ గా తీసుకున్నారు.
తనకు ఇంత వరకు టీటీడీ నోటీసులు అందలేదని.ఆ విషయం టీవీలో చూసి తెలుసుకున్నట్టు చెప్పారు.
నోటీసుల తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని తేల్చిచెప్పారు.తనకు నోటీసులిచ్చే అధికారం మీకెవరిచ్చారని ఆయన ప్రశ్నించారు.
టీటీడీది కేవలం అభ్యర్థన మాత్రమేనని.దానిని నోటీస్ అనలేమని తెలిపారు.అయినా నోటీసులు ఇచ్చేందుకు టీటీడీకి ఎలాంటి అధికారాలు లేవని చెప్పారు.గతంలో తాను 10 విషయాలు మాత్రమే చెప్పానని.
ఇప్పుడు 14 విషయాలు చెబుతానని అన్నారు.ఆరోపణలు చేసిన వ్యక్తిని ఆధారాలు ఏంటని ప్రశ్నించే అధికారం ఎవరికీ లేదని స్పష్టం చేశారు.
మేము అధికారంలోకి వస్తే తండ్రీకొడుకుల అవినీతి మొత్తం బయటపెట్టి ప్రజల ముందు దోషులుగా నిలబెడతామని , నిప్పు నాయుడు – పప్పు నాయుడుకి నిజంగా దమ్ము – చిత్తశుద్ధి ఉంటే సీబీఐ విచారణకు ఆదేశించాలని విజయసాయి రెడ్డి సవాల్ విసిరారు.
‘నేను పదమూడు గంటల సమయం ఇస్తే ఆయన స్పందించలేదు ఇప్పుడు మళ్లీ చాలెంజ్ చేస్తున్నా ప్రభుత్వ ఖజానా అని చెప్పి దేవస్థానం నిధులు దోచుకున్నారు’ అని ఆయన అన్నారు.
వారి ఇంట్లో నేలమాలిగలు సోదా చేసి ఉంటే దోచుకున్న సొమ్ములు దొరికేవని సీబీఐ విచారణలో మాత్రమే అవన్నీ బయట పడతాయని విజయసాయిరెడ్డి వివరించారు.కాగా విజయసాయిరెడ్డి ఇంత స్పష్టంగా ధైర్యంగా సీబీఐ విచారణ డిమాండ్ టీడీపీలో ఆందోళన రేపుతోంది.