కేసీఆర్‌లా జగన్‌ కూడా పట్టువిడుపు ప్రదర్శించాలి

తెలంగాణ సీఎం కేసీఆర్‌పై తెలుగు దేశం పార్టీ నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి ప్రశంసలు కురిపించాడు.కరోనాపై యుద్దం నేపథ్యంలో కేసీఆర్‌ వ్యవహరిస్తున్న తీరును ఆయన అభినందించారు.

 Tdp Farmar Minister Somi Reddy Chandra Mohan Reddy Praise The Telangana Cm Kcr,-TeluguStop.com

ఒకసారి తాను అనుకున్న నిర్ణయాన్ని మార్చుకోవడంలో కేసీఆర్‌ ఎప్పుడు కూడా ఇబ్బంది పడడు.అవసరం అనుకుంటే తప్పకుండా తన నిర్ణయాన్ని మార్చుకుంటూ వస్తాడంటూ ఆయన చెప్పుకొచ్చాడు.

కేసీఆర్‌ రాజకీయ ప్రత్యర్థి అయినా కూడా ఆయన గురించి మాత్రం ఈ రెండు విషయాలను అంతా నేర్చుకోవాలని సూచించాడు.

ఒక నిర్ణయం తీసుకుంటే పరిస్థితులకు అనుగుణంగా ఆ నిర్ణయాన్ని మార్చుకోడంతో పాటు పట్టువిడుపులు ఉండాలి.

కాని సీఎం జగన్‌ మాత్రం నేను నా వల్లే అంతా జరగాలనే ఉద్దేశ్యంతో ఉన్నాడు.ఆయన ఈగోయిస్టు అంటూ మాజీ మంత్రి సోమిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశాడు.

ఈ సమయంలో ఈగోలను పక్కన పెట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉందని ఈ సందర్బంగా సోమిరెడ్డి అన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube