టీడీపీ ఓటమికి వారే కారణం అంటున్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే

వైసీపీ ప్రభంజనంలో గత అధికార పార్టీ తెలుగు దేశం ఘోరమైన ఓటమి చవిచూడాల్సి వచ్చింది.రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 25 సీట్లకే టీడీపీ పరిమితం అయిపొయింది.

 Tdp Ex Mla Bonda Uma Sensational Comments On Tdp Loose Victory1tstop-TeluguStop.com

ఓ విధంగా ఇంత ఘోరమైన ఓటమిని టీడీపీ నేతలు, అధినేత చంద్రబాబు కూడా ఊహించలేదు.తాము చేసిన సంక్షేమ పథకాలు, ఎన్నికల ముందు ఇచ్చిన తాయిలాలు తమని మళ్ళీ అధికారంలోకి తీసుకోస్తాయని భావించారు.

అయితే ఊహించని విధంగా ఎన్నికలలో ఐదేళ్ళ నుంచి టీడీపీ మీద ఉన్న వ్యతిరేకతని ఒక్కసారిగా జగన్ కి అనుకూలంగా ఓటు వేయడం ద్వారా చూపించారు.మూడో పార్టీగా ఉన్న జనసేనకి కూడా ప్రజలు కనీసం అవకాశం ఇవ్వలేదు.

ఇదిలా ఉంటే టీడీపీ ఓటమికి ఇప్పుడు కారణాలు వెతుక్కునే పనిలో అధినేత చంద్రబాబుతో పాటు, ఇతర పార్టీ నేతలు కూడా పడ్డారు.తాను ఎన్ని సంక్షేమ పథకాలు ప్రజలకి అందించిన మళ్ళీ ఓడిపోవడానికి కారణం వైసీపీ మీద ఉన్న సానుభూతి తప్ప తన ఫెయిల్యూర్ కాదనే ఫీలింగ్ లో బాబు ఉన్నారు.

అయితే తాజాగ మాజీ ఎమ్మెల్యే టీడీపీ నేత బొండా ఉమా పార్టీ ఓటమికి కారణాలు కొంత మంది మంత్రులే అని సంచలన వాఖ్యలు చేసారు.పార్టీ మీద ప్రజలలో వ్యతిరేకత ఉన్న కూడా ఆ విషయాన్ని అధినేతకి తెలియకుండా మసిపూసి మారేడుకాయ చేసిన మంత్రులు వలెనే ఈ రోజు టీడీపీ ఓటమి అని మొహమాటం లేకుండా చెప్పేశారు.

ప్రజలలో పెరుగుతున్న వ్యతిరేకత గ్రహించి జాగ్రత్త పడితే ఇంత ఘోరమైన ఓటమి వచ్చేది కాదని చెప్పుకొచ్చాడు.మరి బొండా విమర్శలపై టీడీపీ శ్రేణులు ఇప్పుడు ఎలా రియాక్ట్ అవుతాయి అనేది వేచి చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube