400 రోజులు, 4 వేల కిలోమీటర్లు పాదయాత్ర జనవరి 27 వ తేదీన కుప్పం నుంచి ప్రారంభం కానుంది, సంబంధిత అధికారులకు అనుమతులకు లేఖలు ఇచ్చాం.పోలీసులు, అధికారులు స్పందించకుండా మీనమేషాలు లెక్కపెడుతున్నారు.జగన్ రెడ్డి భయపడుతున్నాడు అందుకే అడ్డంకులు సృష్టించడానికి ప్రయాత్నాలు చేస్తుంది.40 నెలల పాలనలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి వైఫల్యం చెందింది.రైతులకు గిట్టుబాటు ధరలు ఇవ్వడంలో, నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుదల ఇలా ఎన్నో.
అన్ని వర్గాల ప్రజలు కోపంతో ఉన్నారు, బాధతో ఉన్నారు, అంతేకాకుండా నాడు జగన్ రెడ్డి పాదయాత్రలో ఎన్నో వాగ్దానాలు చేశాడు.
అధికారంలోకి వచ్చిన తర్వాత.నేను 9 మాత్రమే ఇచ్చానని చెప్పి, పరిపాలన చెయ్యలేక, రాష్ట్ర ప్రభుత్వం చతికిలపడింది.
నాసిరకం మద్యంతో ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు, ఎక్కువ మద్యం తాగించాలని టార్గెట్లు, వాటిని చెయ్యలేక నానా అవస్థలు పడుతున్నారు అధికారులు .లిక్కర్ ఆదాయం, సగం ప్రభుత్వానికి, సగం తాడేపల్లి కొంపకు, నో డిజిటల్ పెమెంట్, క్యాష్ అండ్ క్యారీ, దోచుకోవడం దాచుకోవడం.
ఇలాంటివి ఎన్నో రకాల సమస్యలు, దోపిడీలు ఉన్నాయి విటన్నింటిని నారా లోకేష్ బాబు యువగళం పాదయాత్రలో ప్రశ్నిస్తారని పులివెందుల పిల్లి, ప్రభుత్వం ఇప్పటిదాకా అనుమతి ఇవ్వలేదు.నారా లోకేష్ బాబు యువగళం పేరుతో చేస్తున్న పాదయాత్రకు అనుమతులు కోరినా ఇప్పటికీ ఇవ్వలేదు, పాదయాత్ర ఎట్టి పరిస్థితుల్లోనూ చేసి తీరుతాం.రాష్ట్ర ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నాను… రెండవ తేదీన జీవో 1 తెచ్చారు, దాని మీద రాష్ట్ర హైకోర్టు స్టే విధించింది, అంత హడావుడిగా ప్రజాధనం దుర్వినియోగం చేస్తూ సుప్రీం కోర్టులో ఎందుకు వేశారు .శేషసైనా రెడ్డి కమీషన్ వచ్చింది.ఈ జగనన్న సైన్యం అనేది ఎవరో ? జనవరి నుంచి అసలైన రాజకీయం చూస్తారని పోస్టులు పెట్టిన అడ్మిన్ ఎవరో ? అందరూ గజగజ వణకాలి.జగనన్న అసలు రాజకీయం చూస్తారని పోస్టులు పెట్టిన అడ్మిన్ ఎవరో ? ఏం రాజకీయమో ? ఎందుకు వణకాలో తెల్చాలి ఈ కమీషన్.మావారు గుంటూరు సభకు వెళ్ళొద్దని అన్నారు, తర్వాత తెలిసింది ఎందుకు వద్దు అన్నారో అని మాట్లాడిన ఆడియోలు వచ్చాయి.వైజాగ్ ఎయిర్ పోర్ట్ వద్ద మంత్రికి అవమానం జరిగిందని పోలీసు అధికారిని సస్పెండ్ చేశారు, కందుకూరు తొక్కిసలాటకు, గుంటూరు తొక్కిసలాట లో విధులు సక్రమంగా నిర్వహించని ఎంతమంది పోలిసులను సస్పెండ్ చేశారు ?
నందిగామలో చంద్రబాబు నాయుడు గారి మీద రాయి వేస్తే ప్రక్కన ఉన్న చీప్ సెక్యూరిటీ అఫిసర్ కి గాయం జరిగింది, దానిని కుడా కమీషన్ దృష్టిలో పెట్టుకోవాలి.రాజాం, బొబ్బిలి, జనం పోటెత్తారు ఎక్కడా ఏం జరగలేదు… జనం తరలివచ్చారు.జగన్ రెడ్డి అభిమానులు పోస్టులు పెట్టిన తర్వాత, వెళ్లొద్దు అని అన్న తర్వాత సంఘటనలు జరిగాయి లోకేష్ బాబు యువగళం పాదయాత్ర ఉందని 1861 నాటి పోలీసు యాక్ట్ నేడు జీవో 1 కింద తెచ్చారు, చంద్రబాబు నాయుడు గారిని సొంత నియోజకవర్గంలో అడ్డుకున్నారు.
ఎందుకు ఇలా చేస్తుందో ప్రభుత్వం ఈ కమీషన్ పరిగణనలోకి తీసుకోవాలి.జగన్ రెడ్డి మంత్రికి అలక వస్తేనే సస్పెండ్ చేశారు భాధ్యత నిర్వహించని వారిని వదిలేశారు .హైకోర్టు లో విచారణ జరుగుతుండగానే ఎందుకు ఇంత తొందరపాటు, సుప్రీంకోర్టుకి వెళ్ళారు ఇవన్నీ కుడా శేషసైనా రెడ్డి కమీషన్ దృష్టిలో పెట్టుకోవాలి.
ప్రతిపక్షం సమస్యల్ని ప్రభుత్వానికి తెలపడమే నారా లోకేష్ బాబు యువగళం పాదయాత్ర, దానికి ప్రభుత్వం భయపడుతుంది .ప్రజల్లో ఉన్న ఆవేదన బాధ కష్టాలను యువగళం పాదయాత్రలో లోకేష్ బాబు ప్రస్తావిస్తారని తెలుసుకొని కుప్పంలో సోషల్ మీడియాలో విష ప్రచారానికి తెరలేపారు వైసిపి నాయకులు .
కుప్పం లో తొలిరోజు జరిగే పాదయాత్రలో భాగస్వామ్యం అవుతాం, తర్వాత ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలో జరిగే పాదయాత్రలో భాగస్వామ్యం అవుతాం.శేషసైన రెడ్డి కమీషన్ తాడేపల్లి కొంపలో సలహాదారు సజ్జల రామకృష్ణ రెడ్డి, ధనుంజయ్ రెడ్డి కనుసన్నల్లో నడుస్తుంది.నారా లోకేష్ బాబు యువగళం పాదయాత్రలో ప్రతి ఒక్క తెదేపా కుటుంబ సభ్యులు భాగస్వామ్యం అవుతున్నారు.
అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు