టీడీపీ పోలవరాన్ని నాశనం చేసింది.. మంత్రి అంబటి

చంద్రబాబు తప్పిదాల వలనే పోలవరం ప్రాజెక్టు అభివృద్ధికి ఆటంకం ఏర్పడిందని మంత్రి అంబటి రాంబాబు అన్నారు.పోలవరంలో చంద్రబాబు హయాంలోనే తప్పిదాలు జరిగాయని చెప్పారు.

అప్పుడు జరిగిన తప్పిదాలను తాము సరి చేస్తున్నామని మంత్రి అంబటి తెలిపారు.డయాఫ్రమ్ వాల్ దెబ్బతినడం వల్ల రూ.2020 కోట్ల నష్టం వాటిల్లిందన్న ఆయన టీడీపీ తప్పిదాల వల్ల కేంద్రం నుంచి రావాల్సిన నిధులు సైతం ఆగిపోయాయని మండిపడ్డారు.టీడీపీ పోలవరాన్ని సర్వనాశనం చేసిందన్నారు.అయితే సీఎం జగన్ చొరవతో రూ.12,911 కోట్లు విడుదల చేసేందుకు కేంద్రం అంగీకరించిందన్నారు.అదేవిధంగా కాఫర్ డ్యామ్, స్పిల్ వే పూర్తి చేసిన జగన్ దేనని చెప్పారు.

గైడ్ బండ్ పెద్ద సమస్యే కాదన్న మంత్రి అంబటి 14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు కుప్పం, చంద్రగిరికి ఏం చేశారని ప్రశ్నించారు.కుప్పంను అభివృద్ధి చేయని వ్యక్తికి మాట్లాడే అర్హత ఉందా అని ప్రశ్నించారు.

ఆయన మరణ వార్త చదువుతూ ఏడ్చేసిన యాంకర్..
Advertisement

Latest Latest News - Telugu News