తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి ముందుకు వెళ్లిన టీడీపీ కాంగ్రెస్ పార్టీలు ఏపీ ఎన్నికల్లో కూడా అదేవిధంగా కలిసి ముందుకు వెళ్తారని అంతా భావించారు.అయితే… తెలంగాణ ఎన్నికల్లో ఈ పొత్తు చిత్తవ్వడంతో… ఏపీ విషయంలో ఈ రెండు పార్టీలు డైలమాలో పడిపోయాయి.ఏపీ ఎన్నికల్లో ఎలా ముందుకు వెళ్లాలో తెలియక సతమతం అవుతున్నాయి.ఈ సందిగ్ధం ఇలా కొనసాగుతుండగానే… ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేయాలని కాంగ్రెస్ నిర్ణయం నిర్ణయించింది.
పొత్తులు లేకుండా 175 స్థానాల్లో పోటీచేస్తున్నట్టు ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి ప్రకటించారు.
ఇది ఏఐసీసీ తీసుకున్న నిర్ణయమని.ఏపీ ఇంఛార్జి ఉమెన్ చాందీ ద్వారా తమకు సమాచారం అందిందని రఘువీరా తెలిపారు.టీడీపీతో అవగాహన కేవలం జాతీయ రాజకీయాలకు మాత్రమే పరిమితమని తెలిపారు.
ఈ నెల 31న అన్ని నియోజకవర్గాల నాయకులతో సమావేశం నిర్వహించి.భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు.
తాజా వార్తలు