తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు వలసల దడ దడ లు ఎక్కువగా కనిపిస్తున్నట్లు ఉంది.అందుకే టిడిపి అధినేత చంద్రబాబు అధ్యక్షతన అత్యవసర కీలక సమావేశం జరుగుతున్నట్టుగా తెలుస్తోంది.
పార్టీకి చెందిన కీలక నాయకులంతా ఈ సమావేశంలో పాల్గొన్నట్టు సమాచారం.ఇంకా మిగిలి ఉన్న నేతలు అత్యవసరంగా హాజరు కావలసిందిగా స్వయంగా చిన్న బాబు లోకేష్ ఫోన్లు చేసి సమావేశానికి హాజరుకావాల్సిందిగా కోరుతున్నది.
ప్రస్తుతం పార్టీ నుంచి భారీగా వలసలు మొదలయ్యేలా కనిపిస్తుండటంతో వాటిని నివారించేందుకు తగిన వ్యూహాలను ఈ సమావేశంలో చర్చిస్తున్నారట.
పార్టీకి చెందిన కీలక నాయకులు దేవినేని అవినాష్, వల్లభనేని వంశీ వైసిపి బాట పట్టడం, కొంతమంది శాసనసభ్యులు బీజేపీలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తూ ఉండటం దీనిపై టిడిపిలో గందరగోళం నెలకొనడం వీటన్నిటి పైన ఈ సమావేశంలో క్షుణ్ణంగా చర్చించేందుకు చంద్రబాబు ఈ అత్యవసర మీటింగ్ పెట్టారట.
అలాగే పార్టీ మారేందుకు రంగం సిద్ధం చేసుకున్న మరికొంతమందికి ఈ పిలుపులు అందినట్టు, అందుబాటులో ఉన్న వారంతా సమావేశంలో పాల్గొనాల్సిందిగా పార్టీ నుంచి పిలుపులు వెళ్తున్నాయట.