ఏపీ సీఎం జగన్ పై సంచలన విమర్శలు చేస్తూ టిడిపి అధినేత చంద్రబాబు ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు.ఇప్పటి వరకు జగన్ పై ఉన్న మొత్తం ఆగ్రహాన్ని ఈరోజు చూపించినట్లుగా వ్యవహరించారు.
నేడు అమరావతిలో రాజధాని జన భేరి సభ లో పాల్గొన్న బాబు జగన్ ఉద్దేశించి సంచలన విమర్శలు చేశారు.నేను సభకు వెళ్తుంటే ఉద్దండరాయునిపాలెం వద్ద అడ్డుకున్నారని, నాకు అక్కడికి వెళ్లే హక్కు లేదా అంటూ బాబు మండిపడ్డారు.
అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని జగన్ పదేపదే తమపై ఆరోపణలు చేస్తున్నారని, అదే నిజమైతే 18 నెలలు అధికారంలో ఉన్న నువ్వు నిరూపించకుండా ఏం పీకుతున్నావ్ అంటూ జగన్ ను ఉద్దేశించి తీవ్ర పదజాలంతో మండిపడ్డారు.
ఈ సందర్భంగా జగన్ పై ఎన్నో ఆరోపణలు చేశారు.
ప్రజలంతా మూడు రాజధానులకు మద్దతు తెలిపితే, తాను రాజకీయాల నుండి వైదొలుగుతానని ప్రకటించారు. హైదరాబాద్ ,విశాఖపట్నం లో కులం ఉందని అభివృద్ధి చేయలేదు.
పులివెందులకు నీళ్లు ఇచ్చామన్నారు.దుశ్శాసనుడు, ద్రౌపతి చీరను పట్టుకున్న కారణంగా ఆ రాజ్యం నాశనమైందని, ఇక్కడ కూడా అదే పరిస్థితి ఎదురు కాబోతోంది అంటూ బాబు జోస్యం చెప్పారు.
హైదరాబాద్ లో నీళ్లు లేకపోతే కృష్ణా నది నుండి నీరు ఇచ్చమ ని గుర్తు చేశారు.ఇక్కడ పుష్కలంగా నీళ్ళు ఉన్నాయని బాబు అన్నారు.జగన్ వన్ టైం ముఖ్యమంత్రి అంటూ బిజెపి వాళ్ళు ఎప్పుడో చెప్పారు అని బాబు చెప్పుకొచ్చారు.130 పైగా సంస్థలు ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు వచ్చాయని గుర్తు చేశారు.అమరావతిలో రాజధాని నిర్మించేందుకు ఫౌండేషన్ కు చాలా ఖర్చు అవుతుంది అని జగన్ పదేపదే చెబుతున్నారు అని, హైదరాబాద్ లోటస్ పాండ్ , బెంగళూరు లో భవనాల ఫౌండేషన్ కంటే తక్కువ ఖర్చు ఇక్కడ ఫౌండేషన్ కు ఖర్చు అవుతుంది అంటూ చంద్రబాబు ఎద్దేవా చేశారు.ప్రస్తుతం జగన్ పై బాబు చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.