పాలన చేతకాకపోతే సలహాలు తీసుకోండి

ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఆరునెలలు పూర్తవ్వడం పై హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి.జగన్ పాలన ప్రశంసిస్తూ వైసీపీ మద్దతుదారులు సోషల్ మీడియాలో పోస్ట్స్ పెడుతుండగా టీడీపీ నాయకులు మాత్రం వ్యతిరేకంగా విమర్శలు చేస్తున్నారు.

 Tdp Chief Chandrababu Naidu Coments On Jagan-TeluguStop.com

ఇక ఇదే విషయమై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విమర్శలు గుప్పించారు.జగన్ తన గొప్ప కోసం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి తీసుకెళ్తున్నారని బాబు మండిపడ్డారు.

ప్రజల నెత్తిమీద అప్పుల భారం పెడతారా అని ఆయన ప్రశ్నించారు.

వైసీపీ ప్రభుత్వం ఇన్ని అప్పులు చేస్తూ, రాష్ట్రాన్ని తాను అప్పుల్లో ముంచి ఇచ్చానని తనపై ఆరోపణలు చేస్తున్నారని , మీకు పాలన చేతకాకపొతే సలహాలు తీసుకోవాలి అంతేకాని అహంకారంతో ప్రజల నెత్తిన అప్పుల భారం పెడితే ఎలా అని బాబు ప్రశించారు.ఆరు నెలల్లో వైసీపీ ప్రభుత్వం సాధించింది ఏదైనా ఉందా అంటే అది అప్పుల్లో మాత్రమే రికార్డు సృష్టించిందని ఆరు నెలల్లో దాదాపు రూ.25 వేల కోట్లు అంటే నెలకు సుమారు మూడున్నర వేల కోట్ల అప్పు చేసి ఒక్క అభివృద్ధి పని కూడా చేయలేదని విమర్శలు చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube