సీఎం అలా పైశాచిక ఆనందం పొందుతున్నారు

వైసీపీ ప్రభుత్వం పై విమర్శలు చేయడంలో టీడీపీ అధినేత చంద్రబాబు అందరికంటే ముందు వరుసలో నిలబడుతున్నారు.ప్రస్తుతం ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు చంద్రబాబు జనాల్లో తిరుగుతూ పార్టీలో కొత్త ఉత్సాహం తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

 Tdp Chief Chandrababu Naidu Coments On Ap Cm Jagan-TeluguStop.com

దీనిలో భాగంగానే కర్నూల్ లో రెండో రోజు పర్యటించిన బాబు వైసీపీ ప్రభుత్వం, జగన్ తీరుపైనా తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో ప్రతీకార దాడులు పెరిగిపోయాయని, టీడీపీ నేతలపై 640 దాడులు జరిగాయని బాబు చెప్పుకొచ్చారు.

ప్రపంచ దివ్యంగుల దినోత్సవం సందర్భంగా కర్నూల్ లో దివ్యంగుల సభలో పాల్గొన్న బాబు ఈ వ్యాఖ్యలు చేశారు.దివ్యాంగులకు మొదటి నుంచి అండగా ఉన్నది టీడీపీ ప్రభుత్వమేనన్నారు.

వైసీపీ అదిఅక్రంలోకి వచ్చిన తరువాత టీడీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టి బెయిల్ కూడా రాకుండా చేస్తున్నారని బాబు మండిపడ్డారు.వైసీపీ నాయకులపై టీడీపీ నాయకులు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడంలేదన్నారు.

మంత్రులు బూతుల మంత్రులుగా తయారయ్యారని బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఒక్కసారి మా వాళ్లు తిరగబడితే మీ పరిస్థితేంటో తెలుసుకోండి అంటూ బాబు హెచ్చరికలు చేశారు.

ఎన్నికల ముందు వైఎస్‌ వివేకాను ఇంట్లోనే హత్య చేసి సాధారణ మరణంగా మార్చారని బాబు విమర్శలు చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube