ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు తెలుగు రాష్ట్రాలలో ఘనంగా జరుగుతున్నాయి.రాజకీయ నాయకుల నుండి సామాన్య ప్రజల వరకు జగన్ మోహన్ గారికి శుభాకాంక్షలు అందుతున్నాయి.
అదే విధంగా చంద్రబాబు నాయుడు జగన్ కు శుభాకాంక్షలు తెలిపిన విషయం చర్చనీయాంశమైంది.
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి డిసెంబర్ 21న తన 48వ ఏటకు అడుగు పెట్టగా… పలువురు మంత్రులు,రాజకీయ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.
కాగా ఆంధ్ర ప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ” వై ఎస్ జగన్ మోహన్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు… ఎల్లప్పుడు సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను” అని జగన్ కు ట్విట్టర్ లో శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ రాష్ట్రం నుండి పలువురు రాజకీయ నాయకులు, మంత్రులు శుభాకాంక్షలు తెలుపగా టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.కాగా సినీ పరిశ్రమ లో కూడా పలువురు నటులు శుభాకాంక్షలు తెలుపగా… సూపర్ స్టార్ మహేష్ బాబు మరింత సేవలను అందించాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలిపారు.
రాజకీయ, సిని రంగాల్లోనే కాకుండా వ్యాపార, పలురకాల రంగాల నుండి ప్రముఖులు అభినందనలు తెలిపారు.
సీఎం క్యాంప్ ఆఫీస్ లో ఘనంగా వేడుకలు చేశారు.అంతేకాకుండా తెలుగు రాష్ట్రాల్లో పలు రాజకీయ నాయకులు, అభిమానులు రక్తదానం శిబిరాలను ఏర్పాటు చేసి రక్తదానం వంటి పలు సేవలు చేశారు.
పలుచోట్ల కేకులు కట్ చేసి… రవాణా సంస్థల్లో స్వీట్లను, అన్నదాన కార్యక్రమాలను చేశారు.అన్ని జిల్లాల్లోనూ బైకులతో భారీగా ర్యాలీలు చేశారు.
మహిళలకు చీరల పంపిణీ, హాస్టల్ లో పండ్ల పంపిణీ వంటి సేవలు చేశారు.
తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా పూణే, చెన్నై, బెంగళూరులో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశారు.
ఇలా దాదాపు అన్ని జిల్లాల్లో, ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాలు సంఖ్య ఇంటర్నేషనల్ రికార్డు స్థాయి దక్కించుకునే అవకాశం ఉందని పలువురు నాయకులు తెలుపుతున్నారు.మత పూజలు, ప్రార్థనలు చేస్తున్నారు.
రాబోయే సంవత్సరాలలో జగన్ సీఎం పదవిని కొనసాగిస్తూ, మరిన్ని సేవలు అందించాలని దీవిస్తున్నారు.మరిన్ని సేవలను అందిస్తూ ఇలాగే తన పాలనను కొనసాగించాలంటూ జగన్ మోహన్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలను తెలుపుతున్నాము.