ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుపై మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.జగన్ ఏం చేసినా కూడా దాన్ని విమర్శించడమే లక్ష్యంగా పెట్టుకుని టీడీపీ పని చేస్తుందని అన్నారు.
తెలుగు దేశం పార్టీ కార్యక్రమాలు కేవలం జూమ్లో మాత్రమే సాగుతున్నాయని, అందుకే ఆ పార్టీని ప్రజలు జూమ్ పార్టీగా అభివర్ణిస్తున్నారంటూ బొత్స ఎద్దేవ చేశాడు.నేడు విశాఖపట్నం వైకాపా కార్యలయంలో ఆయన మాట్లాడుతూ తెలుగు దేశం పార్టీ తీరును ఎండగట్టారు.
సీఎంను చెడుగా చూపిస్తూ రాజకీయ ప్రయోజనాలు పొందేందుకు ప్రతిపక్షం చేస్తున్న కుట్రపై బొత్స అసహనం వ్యక్తం చేశారు.ఎల్జీ పాలిమర్స్ విషయంలో జగన్ చొరవ తీసుకుని కేవలం అయిదు రోజుల్లో సమస్య పరిష్కారం అయ్యి పరిహారం వచ్చేలా చేశాడు.
అదే చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు ఇలాంటి సంఘటన జరిగి ఉంటే 50 రోజులు అయినా పరిహారం అందేది కాదన్నాడు.జగన్ ప్రభుత్వం చేస్తున్న ప్రతి పనిపై తెలుగు దేశం పార్టీ నాయకులు విమర్శలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
జూమ్ యాప్ పార్టీ అయిన తెలుగు దేశం పార్టీకి విమర్శించే నైతికత లేదన్నాడు.