టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి వైసీపీ నాయకుల పై పరుష పదజాలంతో చేసిన విమర్శలు.ఒక్కసారిగా రాష్ట్రంలో రాజకీయ వేడిని రాజేశాయి.
రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయాలపై నాయకులు ఇళ్లపై దాడులు జరగటంతో.రాష్ట్ర పోలీసు వ్యవస్థ అప్రమత్తమైంది.
ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతిభద్రతలు కరువయ్యాయని.చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు.
రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు.
ముఖ్యమంత్రి మరియు పోలీసు వ్యవస్థ కుమ్మక్కయి నేతల ఇళ్లపై పార్టీ కార్యాలయాలపై దాడులు చేయడం జరిగిందని చంద్రబాబు ఆరోపించారు.
రాష్ట్రంలో జరిగిన దాడులకు నిరసనగా నేడు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ బంద్ కు చంద్రబాబు పిలుపునివ్వడం జరిగింది. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడనికి ప్రజాస్వామ్యవాదులు.ఈ బంద్ లో… పాల్గొనాలని చంద్రబాబు కోరారు.ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్టీ కార్యాలయాలపై జరిగిన దాడులను ఖండిస్తూ.
తెలంగాణ టీడీపీ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది.ఏదిఏమైనా టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి చేసిన వ్యాఖ్యలు.
రాజకీయ పెను దుమారాన్ని రేపుతున్నాయి.