ఏపీ రాజకీయాలలో ప్రస్తుతం తెలుగు దేశం పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది.ఇంత కాలం తన తెలివి తేటలతో అన్ని పార్టీలని ఆడుకున్న చంద్రబాబుకి ఇప్పుడు ప్రత్యర్ధి పార్టీల ఎత్తులు, పై ఎత్తులు అర్ధం కాక పార్టీని ఎలా కాపాడుకోవాలో అర్ధం కాక తల పట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.
ప్రస్తుతం చంద్రబాబు ఫ్యామిలీతో విదేశాలలో ఉండగా ఇదే అవకాశంగా భావిస్తూ చాలా మంది తెలుగు తమ్ముళ్ళు కండువా మార్చేయడానికి సిద్ధం అవుతున్నారు.ఇక ఏపీలో టీడీపీ పార్టీతో భవిష్యత్తు ఉండదని భావించి ముందుగానే పార్టీ నుంచి వెళ్ళిపోవడానికి సిద్ధం అవుతున్నారు.
ఇదిలా ఉంటే తెలుగు దేశం పార్టీ ప్రాణం పెట్టె తెలుగు తమ్ముళ్ళు చాలా మంది చంద్రబాబు తర్వాత టీడీపీకి ప్రత్యామ్నాయం ఎవరనే కోణంలో ఆలోచిస్తున్నారు.వారికి ఇప్పుడు కనబడుతుంది ఓ వైపు జూనియర్ ఎన్టీఆర్ కాగా మరో వైపు చంద్రబాబు కోడలు నారా బ్రాహ్మణి.
అయితే మెజారిటీ తెలుగు తమ్ముళ్ళు ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కి పార్టీ పగ్గాలు అప్పగిస్తే భవిష్యత్తుకి ఎలాంటి టెన్షన్ ఉండదని అనుకుంటున్నట్లు తెలుస్తుంది.అయితే ఈ విషయంలో చంద్రబాబు తీసుకునే నిర్ణయంపై టీడీపీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని టాక్ రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది.
మరో వైపు జూనియర్ పార్టీ పగ్గాలు తీసుకోకపోతే మరో ప్రత్యామ్నాయంగా బ్రాహ్మణిని రాజకీయాలలోకి దించాలని, ఆమె తన నాయకత్వ లక్షణాలతో పార్టీని బలంగా నడిపిస్తుందని అనుకుంటున్నట్లు తెలుస్తుంది.మరి ఈ రెండు ఆప్షన్స్ లో చంద్రబాబు దేనికి ఒకే అంటాడు అనేది ఇప్పుడు రాజకీయ వర్గాలలో ఆసక్తికరంగా మారింది.