టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రాజకీయంగా బలం పుంజుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నా అవి పూర్తి స్థాయిలో వర్క్ ఔట్ అవ్వడం లేదు.రాబోయే రోజుల్లో పార్టీని ముందుండి నడిపించాలని చూస్తున్నా సొంత పార్టీ నాయకులేక్ లోకేష్ మీద నమ్మకం కరువైంది.
క్రియాశీలక రాజకీయాల్లో లోకేష్ యాక్టివ్ గానే ఉంటున్నా, కేవలం ట్విట్టర్ ద్వారా మాత్రమే తన అభిప్రాయాలను, ప్రభుత్వంపై విమర్శలు లోకేష్ చేస్తున్నారు.దీంతో లోకేష్ ట్విట్టర్ పిట్ట అంటూ రాజకీయ ప్రత్యర్థులు ఆయనపై విమర్శలు చేస్తున్నా జనాల్లోకి వచ్చేందుకు లోకేష్ ఇంకా భయం భయంగానే ఉన్నారు.
ఎందుకంటే తాను ఏం మాట్లాడినా, ఏదో ఒక తప్పు దొర్లుతుందని, దీంతో మరింతగా అభాసుపాలవుతామని లోకేష్ వెనుకంజ వేస్తున్నారు.
ఇది ఇలా ఉండగా టిడిపిలో కీలక నాయకుల వారసులతో నారా లోకేష్ విందు రాజకీయం చేయడం పై సొంత పార్టీలోనే విమర్శలు పెరుగుతున్నాయి.ఒకపక్క లోకేష్ తండ్రి చంద్రబాబు ప్రజా ఉద్యమాలు, పోరాటాలు చేస్తూ అలుపెరుగకుండా పార్టీ కోసం ఏడు పదుల వయసులో కష్టపడుతుంటే నారా లోకేష్ మాత్రం ఇలా విందులు, వినోదాలతో ఎంజాయ్ చేస్తున్నారు అంటూ టిడిపి కింది స్థాయి నాయకులే మండిపడుతున్నారు.తాజాగా చంద్రబాబు నివాసంలో లోకేష్ బ్రాహ్మణి దంపతులు విందు సమావేశం నిర్వహించారు.
ఈ విందు కార్యక్రమానికి రాష్ట్రంలో ఉన్న సీనియర్ రాజకీయ నాయకుల వారసులంతా హాజరయ్యారు.ఈ విందు తాలూకా ఫోటోలను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో లోకేష్ పై విమర్శలు పెరిగిపోతున్నాయి.కేవలం లోకేష్ కు రాజకీయ వారసులే కనిపిస్తున్నారా ? పార్టీ కోసం కష్టపడ్డవారు ఎవరూ కనిపించడంలేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.మీరు దిగిన గ్రూప్ ఫోటోలో ఒకరిద్దరు మినహా మిగతా అందరూ మీతో సహా ఓడిన వారే కదా అంటూ ట్రోల్ చేస్తున్నారు.
ఏదో బలనిరూపణ చేద్దామనుకుంటూ విందు రాజకీయం నిడిపించిన లోకేష్ కు ఇప్పుడు ఇంటా, బయటా విమర్శలు మూటగట్టుకుంటున్నారు.