రాష్ట్రంలో ఆలయాల్లో విగ్రహాల ధ్వంసం ఘటనలో ప్రతిపక్షాలు మొక్కుబడిగా వైసిపి పార్టీని ఓ రకంగా ఏకిపారేసిన సంగతి తెలిసిందే.ఇలాంటి తరుణంలో పోలీసులు ఘటనకు సంబంధించి చేస్తున్న విచారణలో బయటపడుతున్న నిజాలు ప్రతిపక్షాల కే టెన్షన్ పుట్టిస్తున్న ట్లు సమాచారం.
శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి లో శివుడు ముందు ఉండాల్సిన నంది విగ్రహం బయటపడటం వాటి దృశ్యాలు సీసీ కెమెరా లో పడటం వాళ్లంతా టీడీపీ వాళ్ళు అని బయట పడటం చంద్రబాబు ఆ ఘటన ని సమర్ధించటం అందరికీ తెలిసిందే.
ఇదిలా ఉంటే రాజమండ్రిలో జరిగిన ఓ ఘటన లో పూజారి చేత విగ్రహాన్ని టీడీపీ నాయకులు ధ్వంసం చేయించినట్లు తాజా సంఘటన ఒకటి బయటపడింది.30 వేల రూపాయలు పూజారి చేత టీడీపీ పార్టీకి చెందిన నాయకులు ఈ ఘటనను చేయించినట్లు పోలీసుల విచారణలో తాజా విషయం బయటపడటం జరిగింది. మరోపక్క సరిగ్గా ఎన్నికలు జరుగుతున్న సమయంలో అసలు విగ్రహాల ధ్వంసం ఘటనలో రాష్ట్రవ్యాప్తంగా జరగకపోవడం బట్టి చూస్తే ఇదంతా టీడీపీ విగ్రహాల ను అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తోందని ప్రజలు ఆల్మోస్ట్ ఆల్ డిసైడ్ అయినట్లు సరికొత్త టాక్ ఏపీలో వినబడుతోంది.