ఓటమి భయంతోనే టీడీపీ నేతలు కుప్పంలో దాడులకు పాల్పడ్డారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు.చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు కుప్పానికి చేసేందేమీ లేదని విమర్శించారు.
ఈ క్రమంలో కుప్పంలో జరిగిన దాడులను ఆయన తీవ్రంగా ఖండించారు.ప్రజలపై దాడులు చేయడం ఏంటని ప్రశ్నించారు.
టీడీపీ శ్రేణులు కుట్రపూరితంగా వైసీపీ కార్యకర్త సురేష్ ఇంటిపై దాడికి పాల్పడ్డారని మంత్రి పెద్దిరెడ్డి మండిపడ్డారు.స్థానికంగా ఉద్రిక్తత నెలకొనేలా ప్లాన్ చేసి.
బయట నుంచి జనాన్ని తీసుకొచ్చి దాడులు చేశారని ఆరోపించారు.దౌర్జన్యం చేసి కుప్పంలో గెలవాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాజకీయ కుట్రలతో హంద్రీనీవా పనులకు ఆటంకం కల్గిస్తున్నారని విమర్శించారు.